Saturday, October 5, 2024
HomeతెలంగాణKavvampalli: ఎత్తు బంగారంతో మొక్కులు తీర్చుకున్న కవ్వంపల్లి

Kavvampalli: ఎత్తు బంగారంతో మొక్కులు తీర్చుకున్న కవ్వంపల్లి

సమ్మక్క-సారలమ్మల ఆశీస్సుల కోసం..

అమ్మవార్ల ఆశీస్సులు అందరిపై ఉండాలని, నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని సమ్మక్క-సారలమ్మలను వేడుకున్నట్లు మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలంలోని కొండపల్కల, వేగురుపల్లి-నీరుకుల్ల గ్రామాలలో జరుగుతున్న సమ్మక్క-సారలమ్మ జాతరల్లో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు. ఎత్తు బంగారం (బెల్లం) తూకం వేసి అమ్మవార్లకు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…రెండేళ్లకు ఒకసారి జరిగే వన దేవతలు సమ్మక్క-సారలమ్మ జాతర అధ్యాత్మిక శోభను సంతరించుకుంటుందన్నారు. జాతర సందర్భంగా శివసత్తుల పూనకాలు, డప్పు చప్పుళ్ళు, భక్తుల కోలాహలం మధ్య జాతర ప్రాంగణాలు భక్తి భావనలతో పులకించిపోతాయన్నారు.

- Advertisement -

జాతర జరిగే రోజులలో అరణ్య ప్రాంతాలు జనారణ్యాలుగా మారిపోతాయని ఎమ్మెల్యే అన్నారు. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నందగిరి రవి, ఎంపీటిసి సభ్యుడు రామాంజయ్య, ఎంపీడీఓ నర్సయ్య, ఎంపీఓ రాజేశ్వర్ రావు, నాయబ్ తహసీల్దార్ నవాజ్, జిల్లా కాంగ్రెస్ నాయకులు తాళ్లపల్లి సంపత్ గౌడ్, సాయిరి దేవయ్య, మీస సత్యనారాయణ, గోపు మల్లారెడ్డి, పులి కృష్ణ, రామిడి తిరుపతి, వరహాల చారి, నల్లగొండ రాములు గౌడ్, కొత్తిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మాడ తిరుపతి రెడ్డి, నాగిశెట్టి రాజయ్య, ముద్దసాని శ్రీనివాస్ రెడ్డి, చర్లపల్లి నర్సయ్య గౌడ్, గోశెట్టి సత్యం, టిడిపి మండల అధ్యక్షుడు తోట శ్రీనివాస్, మడుపు ప్రేమ్ కుమార్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కోండ్ర సురేష్, బుర్ర శ్రీధర్ గౌడ్, ముక్కెర సతీష్, గట్టు రవి, గట్టు తిరుపతి, దరిపల్లి రాజ్ కుమార్, దూలం వీరస్వామి, దూలం దేవేంద్ర, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News