Sunday, November 16, 2025
HomeతెలంగాణNanpur: ఐ.డీ.ఓ.సి భవనం త్వరగా పూర్తిచేయాలి

Nanpur: ఐ.డీ.ఓ.సి భవనం త్వరగా పూర్తిచేయాలి

నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా నిర్మించిన ఐ.డీ.ఓ.సి భవన నిర్మాణన్ని, బిఆరెస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని జూన్ 9వ తేదీన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించనున్న సందర్బంగా సందర్శించారు ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే, బిఆరెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బాల్క సుమన్. స్థానిక శాసన సభ్యులు నడిపెల్లి దివాకర్ రావు, మంచిర్యాల డీసీపీ సుధీర్ రాంనాథ్ కేకన్, అదనపు కలెక్టర్ బి.రాహుల్, ట్రైని పి. గౌతమి, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, సంబంధిత ప్రభుత్వశాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. పెండింగ్ పనులు ఏమైనా మిగిలి ఉన్నట్లయితే త్వరగా పనులను పూర్తి చేయాలని సంబంధితశాఖల అధికారులకు విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్ సూచించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad