Sunday, July 7, 2024
HomeతెలంగాణPalla Rajeswar Reddy: మాది గాంధీ స్ఫూర్తి, బీజేపీది గాడ్సే స్ఫూర్తి, కాంగ్రెస్ లో నకిలీ...

Palla Rajeswar Reddy: మాది గాంధీ స్ఫూర్తి, బీజేపీది గాడ్సే స్ఫూర్తి, కాంగ్రెస్ లో నకిలీ గాంధీలు

2వ విడత దళిత బంధులో నియోజక వర్గానికి 1,100 మందికి లబ్ది

తమది గాంధీ స్ఫూర్తిని, బీజేపీది గాడ్సే స్ఫూర్తి అని..ఇక జాతీయ కాంగ్రెస్ లో అయితే ఏకంగా బోలెడుమంది నకిలీ గాంధీలున్నారన్నారు రైతు బంధు సమితి అధ్యక్షులు, ఎమ్మెల్సీ డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఎం .ఎస్ . ప్రభాకర్ ఆరోపించారు. గాంధీ ఆశయాలను కేసీఆర్ ప్రభుత్వం కచ్చితంగా ఆచరిస్తున్నది బీఆర్ఎస్ మాత్రమేనన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి.. గాంధీ సినిమాను దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యార్థులకు రాష్ట్రంలో ప్రదర్శించి జాతిపిత గురించి మరింతగా తెలిసేలా చేశామన్నారు. నిన్న పీఎం మోడీ అబద్దాలు అలవోకగా మాట్లాడారని, మోడీ లాంటి వ్యక్తి గల్లీ నాయకుడి స్థాయిలో వ్యవహరించారని ..మా ప్రాజెక్టుల నుంచి నీళ్లు రాకపోతే ఇన్ని లక్షల టన్నుల ధాన్యం ఎలా పండిందని పల్లా నిలదీశారు. బీజేపీ అంటే బిజినెస్ జనతా పార్టీ అని, పసుపు బోర్డుపై తొమ్మిదేళ్లుగా మొత్తుకుంటే ఇపుడు ఎన్నికల ముందు మోడీ ప్రకటన చేశారన్నారు. ఎప్పుడో ఇవ్వాల్సిన గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఇపుడు ప్రకటించారన్నారు.

- Advertisement -

అంబేడ్కర్ ఆలోచనా విధానాన్ని చిత్తశుద్ధితో అమలు చేస్తున్న ఏకైక సీఎం దేశంలో ఒక్కరేనని, దళిత బంధు మొదటి విడత కింద ప్రభుత్వం ఇప్పటికే 3,870 కోట్ల రూపాయలను వెచ్చించిందన్నారు విప్ ప్రభాకర్. దశల వారీగా అన్ని దళిత కుటుంబాలకు ఈ పథకం కింద లబ్ది చేకూరుతుందని, రెండో విడతలో ప్రతి అసెంబ్లీ నియోజక వర్గంలో 11 వందల మందికి దళిత బంధు ద్వారా లబ్ది చేకూరుతోందన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News