Saturday, July 27, 2024
HomeతెలంగాణKCR bus yatra: కేసీఆర్ బస్ యాత్ర పర్మిషన్

KCR bus yatra: కేసీఆర్ బస్ యాత్ర పర్మిషన్

ఎన్నికల కమిషన్ కు విజ్ఞప్తి

కేసీఆర్ బస్ యాత్ర పర్మిషన్ కోసం ఎన్నికల కమిషన్ వికాస్ రాజ్ ను కలిసిన డా. కేతిరెడ్డీ వాసుదేవ రెడ్డి
బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత, బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ టూర్ ప్రోగ్రామ్ కు సంబంధించి పార్టీ ప్రతినిధిగా ఎన్నికల కమిషన్ ను కలిసిన వాసుదేవ రెడ్డి. అనంతరం మీడియాతో తో మాట్లాడారు.

- Advertisement -

లోక సభ ఎన్నికల దృష్ట్యా ప్రచారంలో భాగంగా ఏప్రిల్ 22నుండి మే 10వ తేది వరకు జరగబోయే
కేసీఆర్ యాత్ర వివరాల్ని వారి దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నికల సందర్భంగా అధికారులందరూ ఈసి పరిధిలోకి వస్తారు కాబట్టి యాత్రకు సంబంధించి తగు భద్రత చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి.. యాత్రలో పోలీసు సహకారం అందేలా ఆదేశాలు ఇవ్వాలని.. సమస్యాత్మక ప్రాంతాల్ని గుర్తించి వాటిపై ఈసి ప్రత్యెక దృష్టి పెట్టాలని.. అవసరమైతే కేంద్ర బలగాలను మొహరించాలని.. ఎన్నికలు పారదర్శకంగా, ప్రశాంతంగా జరిగేలా చూడాలని కోరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News