Monday, June 23, 2025
HomeతెలంగాణPonnam Prabhakar: కవితతో ఆర్. కృష్ణయ్య భేటీపై మంత్రి పొన్నం ఆగ్రహం

Ponnam Prabhakar: కవితతో ఆర్. కృష్ణయ్య భేటీపై మంత్రి పొన్నం ఆగ్రహం

Ponnam Prabhakar comments on R.Krishnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇటీవల బీసీ ఎంజెండా భుజాన ఎత్తుకున్న సంగతి తెలిసిందే. అసెంబ్లీలో జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టాలని ఆమె ధర్నాలు కూడా నిర్వహించారు. అలాగే బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని కూడా నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలోనే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందుకోసం బీసీ కీలక నేత బీజేపీ రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్యతో ఆమె భేటీ కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

వీరిద్దరి భేటీపై బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో బీసీల గురించి కనీసం మాట్లాడని కవితకు ఇప్పుడు బీసీలు గుర్తుకు రావడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. బీసీల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని తెలిపారు. బీసీ రిజర్వేషన్ బిల్లను అసెంబ్లీలో ఆమోదింపచేసి గవర్నర్ వద్దకు పంపినట్లు గుర్తు చేశారు. బీసీ బిల్లుకు రాజకీయ రంగు పులమడం సరికాదని హితవు పలికారు.

బీసీల హక్కుల కోసం పోరాడిన ఆర్. కృష్ణయ్య అంటే తమకు ఎంతో గౌరవం ఉందన్నారు. పదేళ్లు అధికారంలో ఉండి బీసీలకు న్యాయం చేయని కవిత వంటి నేతలతో ఆయన భేటీ కావడం సరికాదన్నారు. ఇలాంటి పనుల వల్ల గౌరవం తగ్గించుకోవద్దని కృష్ణయ్యకు సూచించారు. పార్లమెంటులో బీసీ బిల్లు ఆమోదం కోసం ప్రధాని మోడీ అపాయింట్ మెంట్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. కవిత చేపట్టిన బీసీ రిజర్వేషన్ల ఉద్యమానికి మద్దతు ఇవ్వాలన్న కృష్ణయ్య పిలుపు ఇవ్వడంపై మంత్రి పొన్నం మండిపడ్డారు.

కాగా ఆదివారం కవితతో భేటీ అనంతరం ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ.. బీసీ కాకపోయినా బీసీల బీసీ కాకపోయినా కోసం పోరాడుతున్న కవితను ప్రశంసించారు. బీసీ బిల్లు కోసం జులై 17న తెలంగాణ జాగృతి చేపట్టిన రైల్ రోకోకు తమ మద్దతు ఉంటుందని తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. కవితకు రాజకీయ పార్టీలకు అతీతంగా బీసీ సంఘాలు మద్దతు ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News