Sunday, September 8, 2024
HomeతెలంగాణRajanna Sirisilla: బీజేపీకి షాక్

Rajanna Sirisilla: బీజేపీకి షాక్

మహమ్మద్ బాబాకి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన చల్మెడ

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో భారతీయ జనతా పార్టీకి బిగ్ షాక్ తగిలింది. పార్టీ సీనియర్ నాయకుడు, మైనార్టీ సెల్ మాజీ అధ్యక్షుడు మహమ్మద్ బాబా బీజేపీని వీడి వేములవాడ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహారావు సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరాడు. వేములవాడ పట్టణంలోని చల్మెడ నివాసంలో పార్టీలో చేరిన బాబాకు లక్ష్మీనరసింహా రావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బాబా మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేపట్టిన, చేపట్టబోయే అభివృద్ధి పనులకు ఆకర్షితుడినై, బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంతోనే ముస్లిం మైనారిటీలకు న్యాయం జరుగుతుందని, సమస్యలు పరిష్కారమవుతాయనే నమ్మకంతో పార్టీలో చేరానని తెలిపారు. నవంబర్ 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో చల్మెడ గెలుపు కొరకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం చల్మెడ మాట్లాడుతూ బాబా రాకను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నానని, ఎన్నికల్లో కారు గుర్తు గెలుపు కొరకు కృషి చేయాలని, గెలిచిన వెంటనే ముస్లిం మైనారిటీలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బండ మల్లేశం యాదవ్, నాయకులు అక్రమ్, షకీల్ జానీ, షాహిద్ పాషా, మధు, సంధాని తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News