Sunday, July 7, 2024
HomeతెలంగాణRythubandhu: నాలుగో రోజు రైతుబంధు 1131 కోట్లు

Rythubandhu: నాలుగో రోజు రైతుబంధు 1131 కోట్లు

72,910 కోట్లకు చేరనున్న రైతుబంధు నిధులు

నాలుగో రోజు రైతుబంధు నిధులు 1131 కోట్లు విడుదల చేసినట్టు కేసీఆర్ సర్కారు వెల్లడించింది. 6,64,717 మంది రైతుల ఖాతాలలో ఈ మేరకు జమ చేసినట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. దీంతో ఇప్పటివరకు రూ.4377.42 కోట్లు జమ అయినట్టైంది. ఈ 11 విడతతో మొత్తం రైతుల ఖాతాలలో రైతుబంధు నిధులు రూ.72,910 కోట్లకు చేరుకోనున్నాయని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఈ ఒక్క సీజన్ లోనే రూ.7720 కోట్లు రైతుల ఖాతాలలో జమకానున్నాయని, మంత్రి మీడియాకు వెల్లడించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News