Monday, July 8, 2024
HomeతెలంగాణTanduru: విజయవంతంగా బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం

Tanduru: విజయవంతంగా బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం

బిజెపి కాంగ్రెస్ పార్టీలకు తాండూరులో కనీసం డిపాజిట్లు రావని వచ్చే ఎన్నికలలో వందకు వంద శాతం బిఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేస్తామని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి వెల్లడించారు. తాండూరు పట్టణంలో బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం కన్నుల పండుగగా గులాబీ శ్రేణులతో తాండూరు పట్టణంలోని తులసి గార్డెన్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ మనం ఆత్మీయ సమ్మేళనంతో ఇంత పెద్ద ఎత్తున పండుగ చేసుకుంటుంటే ప్రతి పక్షాల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నయ్ అన్నారు. గత 40 ఏళ్లుగా ఎవ్వరూ చేయలేని అభివృద్ధిని ఒక ఏడాదిలోనే చేసి చూపించా, ఒకప్పుడు తాండూరు అంటే దుమ్ము, దూళీ కానీ ఇప్పుడు తళుక్కుమంటున్న బ్రహ్మాండమైన రోడ్లు. చెత్త గా ఉన్న జిల్లా ఆసుపత్రి నుంచి రాష్ట్రంలోనే నెంబర్ వన్ ఆసుపత్రిగా మార్చి చూపించా. ప్రైవేటు ఆసుపత్రి కి ధీటుగా అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. తాండూరులో మునుపెన్నడూలేని విధంగా రూ.2కోట్లతో బీసీ భవనం. కోటితో అంబేద్కర్ భవనం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రణాళికా బద్దంగా నేషనల్ హైవే తెచ్చిన ఘనత నాకే దక్కుతుంది అని అన్నారు.
తాండూరు అభివృద్ధే నా లక్ష్యం. మునుపెన్నడూలేని విధంగా తాండూరు నియోజకవర్గానికి భారీగా నిధులు తెచ్చాను అని అన్నారు. దేశంలో తాండూరు పేరు తెలిసేలా. మీ బిడ్డ రోహిత్ రెడ్డి ఢిల్లీని షేక్ చేసిండు. రానున్న రోజుల్లో తాండూరు రూపురేఖలు మార్చి, ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా అని అన్నారు. గత పాలనలో చేసే అభివృద్ధి ఏమి లేదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బిజెపి పార్టీని భూస్థాపితం చేసి బిఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా గ్రంధాలయ చైర్మన్ రాజు గౌడ్, పట్టణ అధ్యక్షులు నాయుమ్ అప్ఫు, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ పట్లోళ్ల దీప నర్సింలు, వార్డు కౌన్సిలర్లు, ఇంచార్జి లు, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, యువనాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News