Thursday, April 10, 2025
HomeతెలంగాణHyderabad Metro: హైదరాబాద్ మెట్రోలో సాంకేతిక సమస్య.. ప్రయాణికుల ఇబ్బందులు

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రోలో సాంకేతిక సమస్య.. ప్రయాణికుల ఇబ్బందులు

Hyderabad Metro| హైదరాబాద్ మెట్రోలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో మెట్రో రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. నాగోల్, రాయదుర్గం, మియాపూర్, ఎల్బీనగర్ కారిడార్లలో మెట్రో సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఉదయం 10 గంటల నుంచి సాంకేతిక లోపంతో రైళ్లు నిలిపిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

- Advertisement -

ఆఫీసులకు వెళ్లే సమయం కావడంతో ఉద్యోగులు మరింత ఆందోళన చెందుతున్నారు. త్వరగా సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. దీంతో మెట్రో స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ విపరతీంగా పెరిగింది. అయితే విద్యుత్‌ ఫీడర్‌ ఛానల్‌లో సాంకేతిక సమస్య వచ్చిందని మెట్రో అధికారులు తెలిపారు. సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News