2025 PGCET NOTIFICATION: తెలంగాణలోని వివిధ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే పీజీ సెట్ (PGECET) నోటిఫికేషన్ను జూన్ 13న విడుదల చేయనున్నట్లు టీజీ సీపీ గేట్ కన్వీనర్ ప్రో. పాండురంగరావ్ ప్రకటించారు.
గత అనుభవాలను బట్టి చూస్తే ఆన్లైన్లో ఈ ధరఖాస్తు పక్రియ జరుగుతుంది. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత సుమారు మూడు నుంచి నాలుగు వారాల పాటు దరఖాస్తులకు అవకాశం ఇవ్వబడుతుంది. దరఖాస్తు చివరి తేదీ దగ్గర పడే సమయానికి, ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా కల్పిస్తారు.
ఈ ప్రవేశ పరీక్ష సాధారణంగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) పద్ధతిలో నిర్వహిస్తారు. వివిధ కోర్సులకు సంబంధించిన సిలబస్, పరీక్షా విధానం, ముఖ్యమైన తేదీలతో కూడిన పూర్తి వివరాలు నోటిఫికేషన్లో స్పష్టంగా పేర్కొనబడతాయి. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్సైట్ను సందర్శించాలని ప్రో. పాండురంగరావ్ సూచించారు.
2025 తెలంగాణ సీపీగెట్ నోటిఫికేషన్:
2024 మే 16న విడుదలైన సీపీగెట్ నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. కానీ ఈసారి ఆలస్యంగా వస్తోంది ఈ నోటిఫికేషన్ కోసం ఎంతో మంది విద్యార్థులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. విద్యార్థుల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని ఈనెల 13వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. దీనితో పాటు పూర్తి షెడ్యూల్ను కూడా వెల్లడిస్తారు. దరఖాస్తుల స్వీకరణ పూర్తయిన తర్వాత సబ్జెక్టుల వారీగా ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ ఏడాది కూడా ఉస్మానియా విశ్వవిద్యాలయమే సీపీగెట్ ప్రవేశాల బాధ్యతలను పర్యవేక్షిస్తుంది.
టీజీ సీపీగెట్ ప్రవేశ పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. ఇందులో 100 ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు ఉంటాయి. బయోకెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఫోరెన్సిక్ సైన్స్, జెనిటిక్స్, మైక్రోబయాలజీ వంటి సబ్జెక్టుల పేపర్లలో పార్ట్-ఎలో కెమిస్ట్రీ నుంచి 40 ప్రశ్నలు, పార్ట్-బిలో ఫిజిక్స్, బోటనీ, జువాలజీ, జెనిటిక్స్, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీలలోని ఆప్షనల్ సబ్జెక్టు (బీఎస్సీలో చదివిన) నుంచి 60 ప్రశ్నలు వస్తాయి. బయోటెక్నాలజీ పేపర్లో పార్ట్-ఎ (కెమిస్ట్రీ)లో 40 ప్రశ్నలు, పార్ట్-బి (బయోటెక్నాలజీ)లో 60 ప్రశ్నలు అడుగుతారు. పరీక్షలో వచ్చిన ర్యాంకుల ఆధారంగా సీట్లను కేటాయిస్తారు.