Saturday, May 18, 2024
HomeతెలంగాణThangallapalli: ఎలక్షన్ డే హాలిడే కాదు, భవిత నిర్ణయించేది

Thangallapalli: ఎలక్షన్ డే హాలిడే కాదు, భవిత నిర్ణయించేది

నా ఒక్క ఓటుతో ఏమవుతుందనుకోవద్దు

ఓటు ఎంతో విలువైనదని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి అని తంగళ్ళపల్లి ఎస్సై డి సుధాకర్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి ఎస్సై డి సుధాకర్ తన సిబ్బందితో కలిసి సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ వద్ద వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓటు హక్కు ద్వారా ఎంతో పారదర్శకంగా మనల్ని పరిపాలించే నాయకులను ఎన్నుకుంటామన్నారు. ప్రలోభాలకు లోనై ఓటును దుర్వినియోగం చేస్తే, అనేక దుష్ప్రభావాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంటుందని తెలిపారు.

- Advertisement -

నా ఒక్క ఓటుతో ఏమవుతుందిలే అనే భావన ఎంతమాత్రం సరికాదని పేర్కొన్నారు. ఎలక్షన్‌ డే అంటే హాలీడే కాదని, మన భవితను నిర్దేశించుకునే అతి కీలకమైన రోజుగా గుర్తించాలని సూచించారు. విద్యావంతులు ఎక్కువగా ఉండే పట్టణాలు, నగరాల్లో ఓటింగ్‌ శాతం తక్కువగా నమోదు కావడం దురదృష్టకరమన్నారు. మనల్ని పాలించే వారిని మనం ఎన్నుకునే బాధ్యతను విస్మరించడం ఎంతవరకు సమంజసమో ప్రతిఒక్కరూ ఆలోచన చేయాలని కోరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News