Saturday, May 18, 2024
HomeతెలంగాణThangallapalli: బీఎస్పీకి మూకుమ్మడి రాజీనామాలు

Thangallapalli: బీఎస్పీకి మూకుమ్మడి రాజీనామాలు

మారిన సమీకరణాల నేపథ్యంలో..

బీఎస్పీ పార్టీకి తంగళ్ళపల్లి మండల అధ్యక్షుడు గుండు ప్రేమ్ కుమార్, మండల కమిటీ సభ్యులు బిఎస్పి పార్టీకి ముకుమ్మడి రాజీనామాలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ కార్యాలయంలో పాత్రికేయ సమావేశం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ పరిణామాల దృష్ట్యా రాజ్యాంగానికి ముప్పు పొంచి ఉందనే కారణంతో బిఎస్పికి మూకుమ్మడి రాజీనామా చేశామన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే తప్పనిసరిగా రాష్ట్రీయ పార్టీలు రాజ్యాంగానికి రక్ష కల్పిస్తాయని భావించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాయకత్వంలో.. సిరిసిల్లను ఎంతో అభివృద్ధి చేసిన బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ నాయకత్వంలో ముందుకు వెళ్లడానికి నిర్ణయించుకున్నట్లు వారు వెల్లడించారు. రాజీనామా పత్రాన్ని జిల్లా అధ్యక్షునికి అందజేస్తున్నట్లు తెలియజేశారు. ఈ రోజు పెద్ద ఎత్తున సిరిసిల్ల తెలంగాణ భవన్ లో కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు వారు ప్రకటించారు. ఈ సమావేశంలో మండల కమిటీ సభ్యులు, బిఎస్పి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News