Saturday, May 18, 2024
HomeతెలంగాణThangallapalli: వినోద్ కుమార్ విజయం కోసం శ్రమిస్తున్న తుల ఉమ

Thangallapalli: వినోద్ కుమార్ విజయం కోసం శ్రమిస్తున్న తుల ఉమ

కరీంనగర్ పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్ఎస్ ఎంపి అభ్యర్థి వినోద్ కుమార్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని తుల ఉమ ఓటర్లను కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని ఇందిరానగర్ లో స్థానిక బిఆర్ఎస్ నేతలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కారు గుర్తుకు ఓటేసి పార్లమెంట్ కు ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతు వినోద్ కుమార్ ను పంపాలని ఆమె అన్నారు.

- Advertisement -

ఐదు సంత్సరాలలో బండి సంజయ్ కరీంనగర్ కు అణా పైసా తేలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలతో ప్రజలను మభ్యపెడుతోందని ప్రజలెవరూ నమ్మి మోసపోవద్దని వెల్లడించారు. కరీంనగర్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే వినోద్ కుమార్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించామన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ మానస రాజు, మండల బిఆర్ఎస్ అద్యక్షుడు రాజన్న, ప్యాక్స్ వైస్ చైర్మన్ ఎగుమామిడి వెంకటరమణా రెడ్డి, ప్యాక్స్ డైరెక్టర్ మిరాల భాస్కర్ యాదవ్, మాజి సర్పంచ్ అంకారపు అనిత రవీందర్, పట్టణ అధ్యక్షుడు బండి జగన్, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సద్ద రోజా సురేష్, కందుకూరి రామా గౌడ్, కోడం సంధ్యారాణి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News