Saturday, May 18, 2024
Homeపాలిటిక్స్Thangallapalli: బండి కోసం తమిళనాడు, కర్నాటక బీజేపీ నేతలు

Thangallapalli: బండి కోసం తమిళనాడు, కర్నాటక బీజేపీ నేతలు

శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు..

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలో బిజెపి మండల అధ్యక్షుడు వెన్నమనేని శ్రీధర్ రావు ఆధ్వర్యంలో మండల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తమిళనాడు స్టేట్ బిజెపి వైస్ ప్రెసిడెంట్ కె.నాగరాజన్, కర్ణాటక బీజేవైఎం స్టేట్ జనరల్ సెక్రెటరీ కె.మారుతి పాల్గొని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ భారీ మెజార్టీతో గెలిపించాలని కొన్ని సూచనలు చేశారు.

- Advertisement -

అనంతరం గ్రామంలో ఇంటింటా ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. కమలం గుర్తుపై ఓటు వేసి బండి సంజయ్ కుమార్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. మరోసారి మోడీ ప్రభుత్వం రావాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ మండల ఉపాధ్యక్షులు ఇటుకల రాజు, ఇటుకల మహేందర్, ప్రధాన కార్యదర్శి కళికోట చరణ్, భూత్ అధ్యక్షులు, శక్తి కేంద్రం ఇంచార్జిలు, వివిధ మోర్చా అధ్యక్షులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, బిజెపి పార్టీ అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News