Sunday, May 19, 2024
HomeతెలంగాణThangallapalli: కాంగ్రెస్ శ్రేణుల విస్తృత ప్రచారం

Thangallapalli: కాంగ్రెస్ శ్రేణుల విస్తృత ప్రచారం

వెలిచాల కోసం బంధువుల ప్రచారం

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మండల శాఖ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు భారీ మెజారిటీతో గెలిపించాలని కాంగ్రెస్ శ్రేణులు విస్తృత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు, ఆయన బంధువులు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు.

- Advertisement -

సీఎం రేవంత్ రెడ్డి బలపరిచిన అభ్యర్థి గెలిచాల రాజేంద్ర రావును గెలిపించుకుని కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి తీసుకువచ్చే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిగా చేసే వరకూ ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త సైనికుల్లా పని చేయాలని సూచించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి.. కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అధిక నిధులు వెచ్చించి మన రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసుకోవచ్చని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి వైద్య శివప్రసాద్, జడ్పిటిసి పూర్మాని మంజుల లింగారెడ్డి, మండల అధ్యక్షుడు జలగం ప్రవీణ్ కుమార్, జిల్లా మహిళా అధ్యక్షురాలు కాముని వనిత, సిరిసిల్ల మున్సిపల్ మాజీ చైర్మన్ పర్సన్ సామల పావని దేవదాస్, యూత్ కాంగ్రెస్ నియోజక వర్గ అధ్యక్షుడు చుక్క రాజశేఖర్, కాంగ్రెస్ పార్టీ జిల్లా మత్స్య సహకార సంఘం ప్రధాన కార్యదర్శి చెన్నమనేని ప్రశాంత్, మండల మహిళా అధ్యక్షురాలు హారిక రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి లింగాల భూపతి, గ్రామ శాఖ అధ్యక్షుడు నేరేల్ల నర్సింహం గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ లింగం రాణి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎగుర్ల ప్రశాంత్, మాజీ ఉప సర్పంచ్ పెద్దూరి తిరుపతి, సీనియర్ నాయకులు సుద్దాల శ్రీనివాస్ గౌడ్, ప్రతాప రెడ్డి, సుద్దాల కరుణాకర్ గౌడ్, పయ్యావుల శ్రీనివాస్, విజయ్, యోగి, మహేష్, హమీద్, మాజీ వార్డు సభ్యులు సుద్దాల అరుణ, రెడ్డి పర్షరాములు, ఆంకారపు లక్ష్మి, నాయకురాలు షాహేద బేగం, నస్రీన్ బేగం తదితరులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News