Sunday, May 19, 2024
HomeతెలంగాణJadcharla: బిఆర్ఎస్ తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం

Jadcharla: బిఆర్ఎస్ తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం

యాదయ్య ప్రచారం

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి బిఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని జడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య అన్నారు. పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా మహబూబ్ నగర్ పార్లమెంట్ బిఆర్ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి గెలుపు కోరుతూ జడ్చర్ల మండలం గొల్లపల్లి, ఈర్లపల్లి, బూరుగుపల్లి గ్రామాలలో బిఆర్ఎస్ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

- Advertisement -

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చి కరువు తెచ్చిందని, కరువు నివారణ బిఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని, గత పది సంవత్సరాలలో ఇలాంటి పరిస్థితులు చూడలేదని, కాంగ్రెస్ ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను ఒక్కటి కూడ నెరవేర్చలేదన్నారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికై కారు గుర్తుకు ఓటు వేసి బిఆర్ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు రఘుపతి రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ పాలెం సుదర్శన్ గౌడ్, నాయకులు శంకర్ నాయక్, గిరి యాదవ్, వీరేష్, పురుషోత్తం, శ్రీను, సుజాత, శివలింగం, పర్వతాలు, శ్రీపతి, రాందాస్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News