Tuesday, September 17, 2024
HomeతెలంగాణVidyasagar Rao: SRSP చివరి ఆయకట్టు వరకు నీళ్లిస్తాం

Vidyasagar Rao: SRSP చివరి ఆయకట్టు వరకు నీళ్లిస్తాం

ఎస్సారెస్పి చివరి గ్రామాల వరకు వచ్చే సీజన్ కల్లా నీళ్లు అందిస్తామన్నారు ఎమ్మెల్యే విద్యాసాగర్. ప్రతి గ్రామానికి నీళ్లు అందిస్తామని కోరుట్ల శాసన సభ్యులు కల్వకుంట్ల విద్యాసాగర్ హామీ ఇచ్చారు. మల్లాపూర్ మండలంలోని ఓబుళపూర్, రేగుంట గ్రామాల్లో గండి పడ్డ కెనాల్ ను ఎమ్మెల్యే పరిశీలించారు. ఎస్సారెస్పి అధికారులతో మాట్లాడి వెంటనే కాలువ మరమ్మత్తు పనులు ప్రారంభించి పూర్తిచేయాలని ఆదేశించారు. సీఎం కెసిఆర్ రైతుల పక్షపాతని, రైతుల సంక్షేమం కోసం ఎల్లవేళలా కృషి చేసేది తెలంగాణ ప్రభుత్వం అన్నారు. ఈ కార్యక్రమంలో ఓబులాపూర్, సంగేమ్ శ్రీరాంపూర్, ధాంరాజ్ పల్లి, రేగుంట, వివి రావు పేట్ గ్రామాల రైతులు,ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News