Saturday, February 22, 2025
HomeతెలంగాణKTR: రైతులపై ఎందుకు ఇంత కోపం.. ప్రభుత్వంపై కేటీఆర్ ఆగ్రహం

KTR: రైతులపై ఎందుకు ఇంత కోపం.. ప్రభుత్వంపై కేటీఆర్ ఆగ్రహం

రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం అమానుషంగా ప్రవర్తిస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమైక్యరాష్ట్రంలో పీడించిన సంక్షోభం ఆనవాళ్లను..తెలంగాణ నేలపై మళ్లీ తెస్తామంటే రైతాంగం సహించదని హెచ్చరించారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు

- Advertisement -

“నిన్న ఓ రైతు ఇంటి గేటు ఎత్తుకెళ్లారు. నేడు స్టార్టర్లు పీక్కెళ్లారు. ఇక రేపు పుస్తెలతాళ్లు లాక్కెళతారా? తెలంగాణ ఆడబిడ్డలారా…! ఈ తెలివితక్కువ కాంగ్రెస్ సర్కారుతో జెర పైలం. అప్పుల పాలైన అన్నదాతలపై ఇంత కక్షనా ? కష్టాల్లో ఉన్న కర్షకులపై కాంగ్రెస్ కు ఇంత కోపమా ? అని ప్రశ్నించారు. సాగు నీళ్లిచ్చే సోయి లేదు..పంటలు ఎండుతున్నా పట్టింపు లేదు.. కానీ..రైతులు అష్టకష్టాలు పడుతుంటే వేధింపులా ? బీఆర్ఎస్ ప్రభుత్వం రద్దుచేసిన నీటి తీరువాను.. ఐదేళ్ల తరువాత ఇప్పుడు వసూళ్లకు తెగబడతారా ? తెలంగాణ రైతులంటే అంత అలుసైపోయారా ? ఓట్లనాడు ప్రేమ ఒలకబోసి గద్దెనెక్కాక నరకం చూపిస్తారా ??

2 లక్షల రుణమాఫీ సక్కగ చేయని..సన్నాసులు ఇంత దారుణానికి ఒడిగడతారా ? రైతు భరోసాకు సవాలక్ష ఆంక్షలు పెట్టి..రైతన్నను సంక్షోభంలోకి నెట్టింది మీరు కాదా?? పెట్టుబడి సాయాన్ని ఎగ్గొట్టి..మళ్లీ అప్పులపాలయ్యేలా చేసిన పాపం మీది కాదా..? ఆత్మగౌరవంతో బతికే అన్నదాతలపై ఈ వరుస దాష్టీకాలేంటి ? మీరు చేసిన పాపాలకు బక్కచిక్కిన రైతులపై ఈ దుర్మార్గాలేంటి ? వ్యవసాయరంగంలో సంతోషం ఆనవాళ్లు చెరిపేసి.. సమైక్యరాష్ట్రంలో పీడించిన సంక్షోభం ఆనవాళ్లను..తెలంగాణ నేలపై మళ్లీ తెస్తామంటే రైతాంగం సహించదని..సంఘటితంగా పోరాడుతది..! సీఎంకు బుద్ధి చెబుతది” అని కేటీఆర్ హెచ్చరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News