Saturday, October 5, 2024
HomeతెలంగాణYadadri: పార్టీ కోసం ప్రతి ఒక్కరూ కష్ట పడాలి

Yadadri: పార్టీ కోసం ప్రతి ఒక్కరూ కష్ట పడాలి

కర్ణాటక రాష్ట్ర ఎమ్మెల్యే చంద్రు లమనీ

యాదాద్రి జిల్లా ఆత్మకూర్ మండలంలోని పీస్ గార్డెన్స్ లో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు తడిసిన మల్లారెడ్డి ఏర్పాటు చేసిన ఆత్మకూరు (ఎం), గుండాల మండలాల ముఖ్య నాయకుల సమావేశానికి ముఖ్య అతిథిగా కర్ణాటక రాష్ట్ర గడక్ ఎమ్మెల్యే చంద్రు లామాని విచ్చేశారు.

- Advertisement -


ఈ సందర్భంగా చంద్రు లమాని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండు ఒక్కటే కాంగ్రెస్ లో గెలిసి బిఆర్ఎస్ పార్టీకి అమ్ముడుపోతారని, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే బిఆర్ఎస్ డబ్బాలో పడుతుందన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కష్ట పడి పని చేయాలని అన్నారు. వివిధ గ్రామల నుండి 150 మంది పార్టీలో చేరారు.అనంతరం శివాలయం నుండి పీస్ గార్డెన్స్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. మండల కేంద్రంలోని ఆర్ఎంపీ డాక్టర్ ప్రసాద్ వద్ద స్థానిక రాజకీయ పరిస్థితులపై చర్చించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పడాల శ్రీనివాస్, సూదగని హరీశంకర్ గౌడ్, వట్టిపల్లి శ్రీనివాస్ గౌడ్,జిల్లా ప్రధాన కార్యదర్శి రాఘవుల నరేందర్,జిల్లా కోశాధికారి కాదూరి అచ్చయ్య, ఆలేరు అసెంబ్లీ కన్వీనర్ చిరిగే శ్రీనివాస్, గుండాల మండల అధ్యక్షుడు మరాఠీ బీరప్ప, రెండు మండలాల శక్తి కేంద్రాల ఇంచార్జ్ లు బూత్ అధ్యక్ష కార్యదర్శులు జిల్లా మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News