Gold Price Today: ప్రస్తుతం బంగారం, వెండి రేట్లలో జోరు చూస్తుంటే ఈ ఏడాది వాటి రేట్లు తగ్గేలా అస్సలు కనిపించటం లేదు. కియోసాకీ వంటి పెద్ద నిపుణులు సైతం ప్రస్తుతం పెరుగుతున్న రేట్ల ధోరణిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరికొన్ని నెలల్లో రేట్లు తగ్గొచ్చని వారు అంచనా వేస్తున్నప్పటికీ.. రిటైల్ అలాగే సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి వస్తున్న డిమాండ్ మాత్రం అస్సలు తగ్గటం లేదు. పైగా త్వరలోనే ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం పరిస్థితులు వస్తాయనే భయాలు కూడా చాలా మంది ఇన్వెస్టర్లను బంగారం, వెండి కొనుగోలు దిశగా నడిపిస్తున్నాయి. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల ప్రజలు షాపింగ్ చేయటానికి ముందు పెరిగిన రేట్లను గమనించాల్సిందే..
గ్లోబల్ రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా డాలర్ బలహీనత, ఫెడరల్ వడ్డీ రేట్ల, ఇండస్ట్రీ డిమాండ్ లాంటి కారణాలతో ఈ విలువైన లోహాలు పెరుగుతున్నాయి. మరోపక్క ప్రెసిడెంట్ ట్రంప్ ఫార్మా, ఆటో టారిప్స్ కూడా ప్రకటించటంతో చాలా మంది విలువైన లోహాలను హెడ్జింగ్ కోసం వాడుకుంటున్నట్లు నిపుణులు చెబుతున్నారు. దీనికి తోడు తాజాగా విదేశీ సినిమాలపై కూడా ట్రంప్ 100 శాతం సుంకాలతో విరుచుకుపడటంతో రానున్న కాలంలో మరిన్ని రంగాలపై ట్రంప్ టారిఫ్స్ ఉండొచ్చనే ఊహాగానాలు పెరిగిపోతున్నాయి. మరో పక్క వెండి సరఫరా తగ్గుదల కూడా దీని రేట్ల పెరుగుదలకు కారణంగా తెలుస్తోంది. ఇక చైనాపై 100 శాతం సుంకాల హెచ్చరికతో ప్రపంచ వ్యాప్తంగా ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు.
బుధవారం రోజున 24 క్యారెట్ల గోల్డ్ రేటు గ్రాముకు నిన్నటి కంటే రేటు రూ.54 పెరిగింది. దీంతో హైదరాబాద్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్, విజయవాడ, నెల్లూరు, కడప, తిరుపతి, విశాఖ నగరాల్లో గ్రాము రేటు రూ.12, 889 వద్ద ఉంది. ఇదే నగరాల్లో 22 క్యారెట్ల గోల్డ్ గ్రాము ధర రూ.11,815 వద్ద కొనసాగుతోంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో వెండి రేట్లను పరిశీలిస్తే.. కేజీ వెండి ఇవాళ రూ.వెయ్యి పెరిగి రూ.2లక్షల 7 వేల వద్ద చెమటలు పట్టిస్తోంది.
ఇక దేశంలోని ఇతర మెట్రో నగరాల్లో ఇవాళ్టి గోల్డ్ రేట్లను గమనిస్తే.. 24 క్యారెట్ల గ్రాము రేటు చెన్నైలో రూ.12,938, ముంబైలో రూ.12,889, దిల్లీలో రూ.12,904, కలకత్తాలో రూ.12,889, బెంగళూరులో రూ.12,889, కేరళలో రూ.12,889 వద్ద కొనసాగుతున్నాయి.
ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేట్లు దేశంలోని ముఖ్యమైన మెట్రో నగరాల్లో నేడు పెరిగిన తర్వాత గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.11,860, ముంబైలో రూ.11,815, దిల్లీలో రూ.11,830, కలకత్తాలో రూ.11,815, బెంగళూరులో రూ.11,815, కేరళలో రూ.11,815గా ఉన్నాయి.


