Sunday, July 7, 2024
Homeఆంధ్రప్రదేశ్25 lakhs under Arogyasri: 25 లక్షలకు ఆరోగ్యశ్రీ పెంపుపై రివ్యూ

25 lakhs under Arogyasri: 25 లక్షలకు ఆరోగ్యశ్రీ పెంపుపై రివ్యూ

డిసెంబర్ 18న స్కీమ్ స్టార్ట్

వైయస్సార్‌ ఆరోగ్యశ్రీ కింద రూ. 25 లక్షల వరకూ చికిత్స ఉచితం కార్యక్రమంపై అధికారులతో సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈమేరకు క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి జగన్.

- Advertisement -

డిసెంబర్‌ 18న కార్యక్రమం ప్రారంభం నేపథ్యంలో సమావేశంలో కీలక అంశాలపై చర్చించారు. సమీక్షా సమావేశంలో పాల్గొన్న వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ సీఎస్‌ ఎం టి కృష్ణబాబు, ఆంధ్రప్రదేశ్‌ వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ డాక్టర్‌ ఎస్‌ వెంకటేశ్వర్, ఆరోగ్యశ్రీ సీఈఓ డి కె బాలాజీ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

వైయస్సార్‌ ఆరోగ్యశ్రీ కింద రూ. 25 లక్షల వరకూ చికిత్స ఉచితం.
ఈనెల 18న ప్రారంభించనున్న సీఎం శ్రీ వైయస్‌.జగన్‌.

ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చిన ముఖ్యమంత్రి
– ఆంధ్రప్రదేశ్‌లో ఇది చరిత్రాత్మక నిర్ణయం: సీఎం
– ఆరోగ్యం, విద్య అన్నవి ప్రజలకు ఒక హక్కుగా లభించాలి: సీఎం
– ఈ హక్కులను కాపాడ్డం ప్రభుత్వ బాధ్యత:
– అందుకనే అధికారంలోకి వచ్చిన రోజునుంచే ప్రభుత్వం ఈ అంశాలపై విశేష కృషి చేసింది:
– వైయస్సార్‌ ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వంచేస్తున్న ఖర్చులే దీనికి ఉదాహరణ:

– దీంట్లో భాగంగానే వైయస్సార్‌ఆరోగ్య శ్రీ కింద రూ.25 లక్షల వరకూ ఉచిత చికిత్స కార్యక్రమాన్ని చేపట్టాం:
– ఎవరికి ఎలాంటి వైద్యం అవసరమైనా రూ.25 లక్షల వరకూ చికిత్స ఉచితంగా లభిస్తుందన్న భరోసా ఇవ్వాలి:
– అత్యంత మానవీయ దృక్పథంతో ప్రభుత్వం ఈ విషయంలో ముందడుగు వేస్తోంది:
– వైయస్సార్‌ఆరోగ్య శ్రీ కార్డు ఉందంటే.. ఆ వ్యక్తికి రూ.25 లక్షలు వరకూ వైద్యం ఉచితంగా లభిస్తుంది:
– ఎవరికి ఆరోగ్య పరంగా ఎలాంటి సమస్యలు వచ్చినా సరే వైయస్సార్‌ ఆరోగ్యశ్రీ అండగా నిలుస్తుంది:
– ఆరోగ్యశ్రీలో చికిత్స చేయించుకున్న వారికి మళ్లీ డాక్టర్‌ దగ్గరకు వెళ్లి చెకప్‌ చేయించుకునేందుకు(ఫాలో అప్‌ కన్సల్టేషన్‌) రవాణా ఛార్జీల కింద రూ.300 చెల్లించాలని సీఎం ఆదేశం.
– ఆరోగ్య సురక్ష క్యాంపుల్లో రోగులుగా గుర్తించిన వారికి ఆస్పత్రులకు వెళ్లేందుకు రూ.500లు ఇవ్వాలని ఇదివరకే సీఎం ఆదేశం.
– వైయస్సార్‌ఆరోగ్య శ్రీ కింద ఉచితంగా వైద్యం పొందడం ఎలా? అన్నదానిపై రూపొందించిన వీడియోను అందరికీ పంపించాలన్న సీఎం.
– ఆరోగ్య సిబ్బంది, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది సహా ప్రజలందరికీ కూడా ఈ వీడియోను అందుబాటులో ఉంచాలన్న సీఎం.
– ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేసే స్పెషలిస్టు డాక్టర్లకు అవసరమైన చోట క్వార్టర్లను నిర్మించాలని సీఎం ఆదేశం.

– 18న వైయస్సార్‌ఆరోగ్య శ్రీ కింద రూ.25 లక్షల వరకూ వైద్యం ఉచితం కార్యక్రమం ముఖ్యమంత్రి చేతులమీదుగా ప్రారంభం.
– 19న ప్రతి నియోజకవర్గంలో 5 గ్రామాల చొప్పున జరిగే కార్యక్రమాల్లో పాల్గొనున్న ఎమ్మెల్యేలు:
– మండలంలో వారానికి నాలుగు గ్రామాల చొప్పున కార్డుల పంపిణీ కార్యక్రమం:
– ప్రతి ఇంటికీ ఆరోగ్యశ్రీకార్డుల పంపిణీ జరుగుతుంది. జనవరి నెలాఖరు నాటికి పూర్తి కానున్న కార్డుల పంపిణీ.
– దీంతోపాటు వైయస్సార్‌ఆరోగ్య శ్రీ కింద ఉచితంగా ఎలా వైద్యం పొందవచ్చన్నదానిపై పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తారు:
– ఏఎన్‌ఎం, సీహెచ్‌ఓ, ఆశావర్కర్లు, వాలంటీర్, మహిళా పోలీసులు ఆరోగ్య శ్రీ కార్డుల పంపిణీ సహా, ఆరోగ్య శ్రీని ఎలా వినియోగించుకోవాలో అవగాహన పెంచే ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
– వైయస్సార్‌ఆరోగ్య శ్రీ యాప్‌ను డౌన్లోడ్‌ చేస్తారు. అంతేకాక పనిలోపనిగా దిశయాప్‌ను కూడా డౌన్లోడ్‌ చేస్తారు.
– భావసారూప్యత ఉన్నవారు, ప్రజాప్రతినిధులు, ఉత్సాహవంతులు ఇందులో పాల్గొంటారు:
– వైయస్సార్‌ ఆరోగ్య శ్రీని ఎలా వినియోంచుకోవాలన్నదానిపైనే కాకుండా ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందుతున్నవారికి చేయూత నివ్వడం, అలాగే ఆరోగ్య సురక్ష కార్యక్రమం, చికిత్స పొందుతున్న వారికి సకాలంలో మందులు ఇవ్వడం లాంటి అంశాలపైనా ఈ కార్యక్రమంలో భాగంగా దృష్టిపెడతారు:

ఫేజ్‌–2 ఆరోగ్య సురక్ష జనవరి 1 నుంచి ప్రారంభం.
– ప్రతివారం మండలానికి ఒక గ్రామ సచివాలయం పరిధిలో జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరం.
– అర్బన్‌ ప్రాంతాల్లో వారంలో ఒక వార్డులో ఆరోగ్య సురక్ష కార్యక్రమం.
– జిల్లాల్లో సగం మండలాల్లో మంగళవారం, సగం మండలాల్లో శుక్రవారం శిబిరాలు.
– అర్బన్‌ ప్రాంతాల్లో బుధవారం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాలు.

– ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ రోగులకు అందుతున్న వైద్య సేవలు రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో కూడా అందించాలని సీఎం ఆదేశం.
– స్క్రీనింగ్, మందులు, చికిత్స తదితర అంశాల్లో కిడ్నీ రోగులకు బాసటగా నిలవాలన్న సీఎం.
– డయాలసిస్‌ పేషెంట్లు (సీకేడీ) వాడుతున్న మందులు విలేజ్‌ హెల్త్‌ క్లినిక్స్‌లో అందుబాటులోకి తీసుకురావాలని సీఎం ఆదేశం.
– ఫ్యామిలీ డ్యాక్టర్‌ కాన్సెప్ట్‌తో అనుసంధానం చేయాలని ఆదేశం.
– మార్కాపురంలో కూడా పలాస తరహా వైద్య చికిత్సా సౌకర్యాలు అందుబాటులోకి రావాలన్న సీఎం.
– కొత్తగా కడుతున్న మెడికల్‌ కాలేజీలో ఇప్పటికే నెఫ్రాలజీ డిపార్ట్‌మెంట్‌ కోసం ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దీంతోపాటు యూరాలజీ డిపార్ట్‌మెంట్‌ కూడా తీసుకురావాలని సీఎం ఆదేశం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News