Wednesday, July 3, 2024
Homeఆంధ్రప్రదేశ్Ahobilam: అహోబిలంలో ఏపీ టూరిస్ట్ పోలీస్ స్టేషన్

Ahobilam: అహోబిలంలో ఏపీ టూరిస్ట్ పోలీస్ స్టేషన్

అహోబిలంలో టూరిస్టు పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ గా ఈ పోలీస్ స్టేషన్ ప్రారంభించారు. నంద్యాల జిల్లాలో అహోబిలం అతిపెద్ద పర్యాటక ప్రదేశంగా.. నిత్యం భక్తులు ఇక్కడికి పోటెత్తుతుంటారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులకు ఎలాంటి ఇబ్బంది కలిగకుండా వారి భద్రతకు ఈ ప్రత్యేక పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ టూరిస్ట్ పోలీసు విధానం ద్వారా ఈవ్ టీజింగ్ ను అరికట్టడం.దొంగతనాలు జరగకుండా చూడడం, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేలా ఈ పోలీసులు పనిచేయనున్నారు. దేవాదాయ శాఖను సమన్వయం చేసుకుంటూ ప్రజలకు మెరుగైన సేవలు 24×7 నిఘా ఉండేలా కాపాడనుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News