Sunday, July 7, 2024
Homeఆంధ్రప్రదేశ్Gangula: ప్రజల సంక్షేమం ప్రభుత్వ లక్ష్యం

Gangula: ప్రజల సంక్షేమం ప్రభుత్వ లక్ష్యం

ఆళ్లగడ్డలో గడప గడపకు

ఆళ్లగడ్డ పట్టణ మున్సిపాలిటీ 3వ సచివాలయం పరిధి పడకండ్ల లోని శారద నగర్ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి పాల్గొన్నారు. కాలనీ చేరుకున్న ఆయనకు వైసీపీ నాయకులు మాజీ కేంద్ర కాటన్ బోర్డు మెంబర్ సిపి వాసు, సుధాకర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రతి ఇంటిని ప్రతి గడపను సందర్శించి సంక్షేమ పథకాలు గురించి వివరించి సంక్షేమ పథకాల అందిన అబ్ధిదారులను పలకరించి వారికి ఇచ్చిన బుక్లెట్ ద్వారా సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని కుటుంబ సభ్యులను అడిగి అర్హులయిండి సంక్షేమ పథకాలు అందనివారు సచివాలయాల్లో సంప్రదించాలని ఎమ్మెల్యే గంగుల తెలిపారు.

- Advertisement -

తమ కాలనీ ప్రజల సమస్యలను ఏమున్నా తమ దృష్టికి తేవాలని వాటికి వెంటనే సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని కాలనీ ప్రజలకు హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క లబ్ధిదారునికి ప్రతి ఒక్క కుటుంబానికి అందేలా చర్యలు తీసుకోవాలని సచివాలయం సిబ్బందికి వాలంటీర్లకు తెలియజేశారు. సచివాలయ సిబ్బంది ప్రజలకు అందరూ అందుబాటులో ఉండాలని ఆయన తెలిపారు. రాబోయే ఎన్నికల్లో వైయస్. జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రి చేసుకోవాలని మీ అందరి చల్లని దీవెనలు అందించి ఆదరించాలని ఎమ్మెల్యే గంగుల కోరారు. కౌన్సిలరుగోట్లూరు సుధాకర్ రెడ్డి , బాలబ్బి, కో ఆప్షన్ మెంబర్ రమేష్ గౌడ్, సింగం వెంకటేశ్వర్ రెడ్డి, కొత్తూరు సునీల్, దామోదర్ రెడ్డి, ఎస్సై వెంకట్ రెడ్డి, అన్నిశాఖల అధికారులు, సచివాలయం సిబ్బంది, గ్రామ వాలంటీర్లు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News