Tuesday, September 17, 2024
Homeఆంధ్రప్రదేశ్Allagadda: వాలంటీర్లను సన్మానించిన గంగుల

Allagadda: వాలంటీర్లను సన్మానించిన గంగుల

ఆళ్ళగడ్డ పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం లో గ్రామ వాలేంటీర్లకు సేవా వజ్ర,సేవారత్న,సేవా మిత్ర అవార్డులతో ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రా రెడ్డి ఎంపీపీ గజ్జల రాఘవేంద్ర రెడ్డి వారందరినీ సన్మానించారు.
ఈ కార్యక్రమంలో వాలంటీర్లను ఉద్దేశించి ఎమ్మెల్యే గంగుల నాని మాట్లాడుతూ ..మీరు ప్రభుత్వానికి ప్రజలకు వారధులనీ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో మీ సేవలు కొనియాడదగినవనీ ఇంకా మరింత యాక్టిివ్ గా ఉండి మీ స్థానిక నాయకుల సూచనలు, సలహాలు తీసుకుంటూ ముందుకు సాగాలని వాలంటీర్లను ఎమ్మెల్యే గంగుల కోరారు.. అనంతరం వాలంటీర్లు సేవా వజ్ర సేవరత్న సేవా మిత్రా వారందరూ కలిసి ఎమ్మెల్యే గంగుల ఎంపీపీ గజ్జల ను పూలమాలతో సన్మానించారు
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సుబ్బారెడ్డి ,వైఎస్సార్సీపీ నాయకులు రామ్మోహన్ రెడ్డి ,వైస్ ఎంపీపీ నర్సింహా ప్రసాద్,కేడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ నాసారి వెంకటేశ్వర్లు ,నల్లగట్ల విజయ కుమార్ రెడ్డి కృష్ణాపురం వైఎస్సార్సీపీ నాయకులు కృష్ణా రెడ్డి గారు,చిన్న కందుకూరు వైఎస్సార్సీపీ నాయకులు గంగుల నారాయణ రెడ్డి గారు..పలువురు వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News