Monday, November 17, 2025
Homeఆంధ్రప్రదేశ్Allagadda: వచ్చే ఎన్నికల్లో టీడీపీ గల్లంతే: గంగుల ప్రభాకర్ రెడ్డి

Allagadda: వచ్చే ఎన్నికల్లో టీడీపీ గల్లంతే: గంగుల ప్రభాకర్ రెడ్డి

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని.. జగన్ మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిని చేసేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు వైసీపీ ఎమ్మెల్యే, విప్ గంగుల ప్రభాకర్ రెడ్డి. “మా నమ్మకం నువ్వే జగనన్న” కార్యక్రమంలో నియోజకవర్గంలో గంగుల మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి పేదవాడి హృదయంలో ఉన్నారని, ప్రతి సంక్షేమ పథకాన్ని అందుకున్నవారు ఆయనకు రుణపడి ఉన్నారన్నారు. ఈసందర్భంగా కన్వీనర్లు,గృహసారథులు, గృహసారథులకు, సచివాలయ కన్వీనర్లకు దిశా నిర్దేశం చేశారు. ఇన్నాళ్లు ఓటు వేయాలని మాత్రమే ఆలోచించామని.. ఇకపై ఇతరుల చేత ఓట్లు వేయించే పనిచేయాలని వారు సూచించారు. గృహసారథులు, వాలంటీర్లు ఎన్నికల రథసారథులని తెలిపారు. వారందరూ ముందుండి.. జగన్ మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిని చేయాలన్నారు. చంద్రబాబును ప్రజలు నమ్మడం లేదని.. ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గల్లంతవుతుందని గంగుల అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad