Monday, November 17, 2025
Homeఆంధ్రప్రదేశ్Allagadda: గంగుల నానిని ఆశీర్వదించండి

Allagadda: గంగుల నానిని ఆశీర్వదించండి

హామీలు వంద శాతం అమలు చేసిన ఏకైక CM జగన్

రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో యిచ్చిన హామీలను నూటికి నూరు శాతం అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అని మాజీ ఎమ్మెల్సీ రాష్ట్ర జలవనరుల శాఖ ప్రభుత్వ సలహాదారులు గంగుల ప్రభాకర్ రెడ్డి అన్నారు. నవరత్నాల కార్యక్రమంలో భాగంగా ఆళ్లగడ్డ నియోజకవర్గం పరిధిలో గల అర్హులైన జగనన్న ఇంటి స్థలాల లబ్ధిదారులకు పట్టణంలోని ఎమ్మార్వో కార్యాలయం ఆవరణంలో రాష్ట్ర జలవనరుల శాఖ సలహాదారులు మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా 4,862 మంది లబ్ధిదారులకు ఇంటి స్థలాల పట్టా పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

- Advertisement -

ఆళ్లగడ్డ మండల పరిధిలో 1,088 మంది లబ్ది దారులకు గాను 862 మందికి, ఉయ్యాలవాడ మండల పరిదిలో 765 మంది లబ్ధిదారులకు గాను 686 మందికి, శిరివెళ్ళ మండల పరిధిలో 1,138 మందికి గాను 1,042 మందికి, ఛగలమర్రి మండల పరిధిలో 1,651 మందికి గాను 1,309 మందికి, రుద్రవరం మండల పరిధిలో 901 మందికి గాను 831 మందికి, దోర్నిపాడు మండల పరిధిలో 522 మందికి గాను 482 మంది లబ్ది దారులకు ఇంటి స్థలాల పట్టాలను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో ఆరు మండలాల ఎమ్మార్వోలు, విఆర్వోలు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad