Sunday, November 16, 2025
Homeఆంధ్రప్రదేశ్Amaravathi: పెండింగ్ లో ఉన్న వైఎస్ఆర్ బీమా అప్లికేషన్స్ పూర్తి చేయండి: జయరాం

Amaravathi: పెండింగ్ లో ఉన్న వైఎస్ఆర్ బీమా అప్లికేషన్స్ పూర్తి చేయండి: జయరాం

అర్హులైన ప్రతి కార్మికుడికి లబ్ది చేకూరేలా అధికారులు పని చేయాలని ఏపీ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్ అధికారులను ఆదేశించారు. సచివాలయంలోని 3వ బ్లాక్ లోని తన ఛాంబర్లో అధికారులతో మంత్రి గుమ్మనూరు జయరాం ఈమేరకు సమావేశం ఏర్పాటు చేశారు. వైయస్ఆర్ బీమా, లేబర్ సెస్ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైయస్ఆర్ బీమా పథకం కేంద్ర ప్రభుత్వము సహకారం లేకుండా వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. వైయస్ఆర్ బీమా పెండింగ్ లో ఉన్న 262 అప్లికేషన్స్ ను ఫిబ్రవరి లోపు పూర్తి చేయాలి సూచించారు. కార్మిక సభ్యత్వ నమోదు కార్యక్రమం వచ్చే నెల ఫిబ్రవరి లోపు పూర్తి చేయాలి అన్నారు. వైయస్ఆర్ బీమా బాధితులకు నియమిత కాలంలో చెల్లించవలసిందిగా ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులను కోరారు.

- Advertisement -



సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad