వన్ నేషన్-వన్ ఎలక్షన్ దేశానికి అవసరమైన మార్పు అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తెలిపారు. చెన్నైలో జరుగుతున్న వన్ నేషన్-వన్ ఎలక్షన్ సెమినార్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. భారత్కు ఉన్న సామర్ధ్యం రీత్యా ‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’ ఆచరణ సాధ్యమే అని తెలిపారు. దేశాన్ని ముందుకు తీసుకెళ్లే నాయకుడు ప్రధాని మోడీ(PM Modi) అని కొనియాడారు. మోడీ నాయకత్వంలో అభివృద్ధి పరుగులు పెడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి గెలవబోతుంది అని జోస్యం చెప్పారు. ఎన్డీయే కూటమి గెలుపు కోసం పనిచేయడానికి తానెప్పుడు సిద్ధంగా ఉంటానని పేర్కొన్నారు. ఈ క్రమంలో సినిమాలు వేరు, రాజకీయాలు వేరు అని అన్నారు. ఇక ఈవీఎంలపై వైసీపీకీ ఓ విధానం లేదని పవన్ విమర్శించారు. ఈవీఎంలపై వైసీపీ చేస్తున్న ఆరోపణలు సరికాదని.. 2019లో వైసీపీ గెలిచింది కూడా ఈవీఎంలతోనే అని గుర్తుచేశారు.