Thursday, July 4, 2024
Homeఆంధ్రప్రదేశ్AP: విజయవాడ నుంచే హజ్ యాత్ర

AP: విజయవాడ నుంచే హజ్ యాత్ర

రాష్ట్ర ప్రభుత్వం హజ్ యాత్రికులకు శుభవార్త చెప్పిందని ఏపీ స్టేట్ హజ్ కమిటీ చైర్మన్ బద్వేల్ షేక్ గౌసల్ ఆజామ్ అన్నారు. 2023 హజ్ యాత్రికుల కోసం తామంతా సమావేశం నిర్వహించుకుని పలు నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. గతేడాది 1100 మంది హజ్ యాత్రకు వెళ్లారని, ఈసారి రెట్టింపు చేయడంతో 3 వేల మంది వరకు వీసాలు వస్తాయనుకుంటున్నామని, వారందరినీ తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేయబోతున్నామని వివరించారు. హజ్ యాత్రికుల్లో 3 లక్షల ఆదాయం ఉన్నవారికి, 60 వేలు, అంతకు పైబడి ఆదాయం ఉన్నవారికి 30 వేల చొప్పున హాజీలకు బహుమతిగా అందిస్తామన్నారు. హాజీలకు ఉన్న గొప్ప అవకాశం ఏంటంటే దేశంలోని ఏ రాష్ట్రం వారైనా, ఏ రాష్ట్రం నుంచైనా హజ్ యాత్రకు వెళ్లే అవకాశం ఉందని తెలిపారు. అయితే ఆంధ్రప్రదేశ్ హాజీలు విజయవాడ విమానాశ్రయం నుంచి వెళితే వారికి అన్ని సౌకర్యాలు కల్పించడానికి అవకాశం ఉంటుందని, ప్రభుత్వం అందించే బహుమతులు తీసుకోవచ్చని వివరించారు. ఇక్కడి నుంచే మక్కా కూడా పంపాలని భావిస్తున్నామని, మక్కా, మదీనాలలో తమ తరఫున మెడికల్ క్యాంపులు నిర్వహిస్తామని తెలిపారు. హాజీలకు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తామన్నారు.

- Advertisement -

విజయవాడ అంబారిగేషన్ పాయింట్ నుంచి హజ్ వెళ్లే యాత్రికులను మానిటరింగ్, ట్రాకింగ్ చేయడానికి వీలుగా ఉంటుందన్నారు. ఒకవేళ హైదరాబాద్, బెంగళూరు నుంచి వెళితే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకోవాల్సిన పని ఉంటుందని, అలా కాకుండా విజయవాడ నుంచి అంబారిగేషన్ పాయింట్ ఏర్పాటు చేసినందున ఇక్కడి నుంచే వెళ్లే అవకాశం ఉన్నందున సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విజయవాడ అంబారిగేషన్ పాయింట్ నుంచి 3,000 మందికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. విజయవాడలోని ఓల్డ్ టెర్మినల్ ను పూర్తిగా హాజీలకే కేటాయించి, అన్ని సదుపాయాలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. మొదటి ఆప్షన్ విజయవాడ పెట్టుకోవాలని, రెండో ఆప్షన్ గా దేశంలోని ఏ పాయింట్ నైనా పెట్టుకోవచ్చని తెలిపారు. అయితే వేరే రాష్ట్రం నుంచి వెళ్లేవారికి పూర్తిగా సదుపాయాలు కల్పించలేమని, కనుక విజయవాడ నుంచే వెళ్లాలని హజ్ యాత్రికులను కోరారు. ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించి నవరత్నాల పథకం కింద చేర్చి 3 లక్షలలోపు ఆదాయం ఉన్నవారికి 60 వేలు, ఆపై ఆదాయం ఉన్నవారికి 30 వేలు అందిస్తున్నామన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News