Tuesday, April 8, 2025
Homeఆంధ్రప్రదేశ్AP: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన జగన్

AP: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన జగన్

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌లో భాగంగా అసెంబ్లీ కమిటీ హాల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు సీఎం  వైయస్‌ జగన్‌. ఎమ్మెల్యే కోటాలోని ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు నేటి ఉదయం 9 గంటలకు వెలగపూడి లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ మొదటి అంతస్తులో ప్రారంభమైన ఎన్నికల ప్రక్రియ జరిగింది. తొలుత రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తమ ఓటు హక్కును వినియోగించుకోవడంతో ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.

- Advertisement -

తదుపరి  ఉప మంత్రి (ఆబ్కారీ) నారాయణస్వామి,  రాష్ట్ర మంత్రులు గుడివాడ అమర్నాథ్, ఉషశ్రీ చరణ్, దాడిశెట్టి రాజా, ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు, మేకతోటి  సుచరిత తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్ర మంత్రులు ధర్మాన ప్రసాదరావు, మాజీ మంత్రి పాముల పుష్ప శ్రీవాణి,  ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, కొలుసు పార్థసారథి తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News