Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్AP: 'నవరత్నాలు' మహిళా జాతి భవితను మార్చేస్తున్నాయి

AP: ‘నవరత్నాలు’ మహిళా జాతి భవితను మార్చేస్తున్నాయి

రాష్ట్రంలో మహిళా సాధికారత, సమగ్రాభివృద్ధికి ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పెద్దపీట వేశారని, ముఖ్యమంత్రి వల్లే ఇది సాధ్యమవుతుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి విడదల రజని తెలిపారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మంత్రి విడదల రజని మాట్లాడుతూ మహిళలకు సమాన అవకాశాలు కల్పిస్తున్న ప్రభుత్వం తమదేనని పేర్కొన్నారు. ప్రతి అడుగులోనూ సీఎం జగన్ మోహన్ రెడ్డి మహిళలకు అండగా ఉన్నారని వెల్లడించారు. ప్రతి ఇంటిలో మహిళకు ప్రాధాన్యత పెరగడానికి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ఒక కారణమన్నారు.

- Advertisement -

నవరత్నాల ద్వారా అమలు చేస్తున్న ప్రతి పథకం మహిళల అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టిందే అన్నారు. మహిళలకు అన్ని స్థాయిల్లో మేలు చేస్తున్నాం కాబట్టే తమ రాష్ట్రంలో మహిళలు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. మాటకు, చేతకు మన్నన ఇచ్చే మనసున్న వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అని కొనియాడారు. మహిళలు సొంతంగా తమ కాళ్ల మీద తామే నిలబడి ఎదగాలని మహిళల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. ప్రధానంగా అక్కచెల్లెమ్మలకు వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత, కాపునేస్తం వంటి పథకాల ద్వారా సాధికారతతో పాటు తోడ్పాటు అందిస్తున్నామన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News