Sunday, July 7, 2024
Homeఆంధ్రప్రదేశ్AP: చెప్పిందే చేస్తాం, చేసేదే చెప్తాం

AP: చెప్పిందే చేస్తాం, చేసేదే చెప్తాం

మాది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వమని.. చెప్పింది చేస్తాం చేసేదే చెప్తాం అంటూ స్థానిక ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి అన్నారు. ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలను ఆదుకునేందుకు జగనన్న కాలనీ నిర్మిస్తున్నారని పత్తికొండ శాసనసభ్యులు కంగాటి శ్రీదేవి అన్నారు. మద్దికేరలోని స్థానిక డి పి ఏ పి కమ్యూనిటీ హాల్లో జడ్పిటిసి మురళీధర్ రెడ్డి ఇరిగేషన్ శాఖ రాష్ట్ర డైరెక్టర్ రేలంపాడు వెంకటేశ్వర్లు మండల పరిషత్ అధ్యక్షురాలు దోనిపిగారి అనిత ఇంచార్జ్ తాసిల్దార్ నాగరాజు ఆధ్వర్యంలో శాసనసభ్యురాలు పట్టాల పంపిణీ చేశారు అనంతరం మాట్లాడుతూ గ్రామంలో గత 15 సంవత్సరాల క్రితం పేద ప్రజలకు ఇంటి నిర్మాణ నిర్మించుకునేందుకు గాను కొండమ్మ భావి దగ్గర పొలాలు ప్రభుత్వ కొనుగోలు చేసిందని ఆనాటి నుండి నేటి వరకు ఏ ప్రభుత్వం వచ్చినా పేద ప్రజలకు మాత్రం పట్టాలు పంపిణీ చేయలేదని ఇంచార్జ్ తాసిల్దార్ నాగరాజు జెడ్పిటిసి సభ్యులు మురళీధర్ రెడ్డి చొరవతో పట్టాలు పంపిణీ చేయడం శుభపరిణామం అన్నారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో పత్తికొండ మార్కెట్ యార్డ్ చైర్మన్ కుమ్ములూరి పకీరప్ప ఎంపీడీవో నరసింహా మూర్తి ఈ ఓ పి ఆర్ డి మద్దిలేటి స్వామి సర్పంచ్ లుబండారు సుహాసిని బురుజుల విజయుడు కార్మంచి మల్లికార్జున మాజీ సర్పంచులు కొత్తపేట వెంకటేశ్వర్ రెడ్డి శాంతన్న గంపల వెంకటేశ్వర్లు మాజీ ఎంపీపీ మల్లికార్జున యాదవ్ మాజీ ఎంపీటీసీ ధోనీపి గారి గారి శ్రీనివాసులు ఎంపీటీసీ సభ్యులు రామకృష్ణ అంజి ఉప సర్పంచ్ ప్రమీలమ్మ ఆర్ఐ రవికుమార్ వీఆర్వోలు రంగస్వామి పకీరప్ప ఉన్నారు పంచాయతీ సలహా దారుడుబండారు ఆంజనేయులు పలువురు వైసిపి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News