Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Athmakur: జగన్ వల్లే రాష్ట్రం దివాలా

Athmakur: జగన్ వల్లే రాష్ట్రం దివాలా

రాష్ట్రం దివాలా తీయటానికి కారణం ముఖ్యమంత్రి జగన్, ఆయన అనుసరిస్తున్న విధానాలే అంటూ మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అన్నారు. ‘ఇదేం ఖర్మ’ కార్యక్రమంలో భాగంగా 13వ రోజు ఆత్మకూరులోని రహమత్ నగర్లో బుడ్డా పర్యటించారు. ఈ సందర్భంగా బుడ్డా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ను అప్పుల రాష్ట్రంగా మార్చారని, ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో రాష్ట్రం ఉందంటే జగన్ పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవాలన్నారు. పేరు గొప్ప ఊరు దిబ్బలా జగన్ పాలన నడుస్తోందన్నారు. రాష్ట్రాన్ని పరిపాలించే సత్తా ఒక చంద్రబాబుకే సాధ్యమవుతుందని తెలిపారు. ఏ గ్రామంలో చూసినా మౌలిక వసతులు లేక జనం అల్లాడుతున్నారని, పంచాయతీ నిధులను రాష్ట్రం మరో దానికి వాడుకుంటే, సర్పంచులు తలలు పట్టుకుంటూ చేసేది ఏమి లేక సొంత నిధులను కొందరు ఖర్చు పెట్టి పనులు చేస్తున్నారని అన్నారు. శ్రీశైలం నియోజకవర్గం లో చంద్రబాబు హయంలో ఎన్నో అభివృద్ధి పనులను చేసిన ఘనత టిడిపి ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. టిడిపి చేసిన పనులను సైతం మేము చేశామని చెప్పుకుంటూ తిరుగుతున్నారు తప్పా ఇప్పటికి చేసిందేమీ లేదు అన్నారు. ఇదేమని అడిగితే జగన్ నిధులను ఇవ్వడం లేదని ఎమ్మెల్యేలే బహిరంగంగా చెప్పడం చూస్తున్నామన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News