Sunday, July 7, 2024
Homeఆంధ్రప్రదేశ్Athmakuru: ఎంపీ ఫోటోను చెప్పుతో కొట్టి..

Athmakuru: ఎంపీ ఫోటోను చెప్పుతో కొట్టి..

నిప్పులు చెరిగిన టీడీపీ శ్రేణులు

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన వై.సి.పి ఎంపీ గోరంట్ల మాధవ్ తీరు పట్ల రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు భగ్గున మండిపడుతున్నారు. అందులో భాగంగా ఆత్మకూరు పట్టణ తెలుగుదేశం పార్టీకి చెందిన యువ నాయకుడు అధికార ప్రతినిధి మోమిన్ ముస్తఫా నిరసన తెలుపుతూ తన స్వగృహము వద్ద కార్యకర్తలతో కలసి ఎంపి మాధవ్ చిత్రపటాన్ని చెప్పులతో కొట్టి అగ్నిలో దహనం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మో మిన్ ముస్తఫా మాట్లాడుతూ.. 2024 లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే మీ జగన్ రెడ్డి కూడా చస్తాడా అంటూ గోరంట్ల మాధవ్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అనుచిత వ్యాఖ్యలు చేసిన మాధవ్ మీద పార్లమెంట్ స్పీకర్ చర్యలు తీసుకోవాలి అన్నారు. మహిళల పట్ల గౌరవం లేని నీచ సంస్కృతి కలిగిన మాధవ్ నగ్న వీడియో కాల్ తో ఆంధ్ర రాష్ట్ర పరువు తీసిన బ్రోకర్ గాడు అని విమర్శించారు..
అధికార మదంతో రెచ్చిపోతున్న వై.సి.పి నాయకులకు 2024 లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే జైలు లో చిప్పాకూడు తినడమే చివరి అవకాశం అని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News