Thursday, July 4, 2024
Homeఆంధ్రప్రదేశ్Banaganapalli: మాజీ ఎమ్మెల్యే వర్గం వందల ఎకరాల్లో దొంగ పట్టాలు సృష్టించారు: ఎమ్మెల్యే కాటసాని

Banaganapalli: మాజీ ఎమ్మెల్యే వర్గం వందల ఎకరాల్లో దొంగ పట్టాలు సృష్టించారు: ఎమ్మెల్యే కాటసాని

మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి అనుచరులు అధికార దుర్వినియోగంతో 2014 సంవత్సరంలో అసైన్మెంట్ కమిటీ లేకుండానే వందలాది ఎకరాలలో నకిలీ పట్టాలు సృష్టించి లక్షలాది రూపాయలు సొమ్ము చేసుకున్నట్లు ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆరోపించారు. కొలిమిగుండ్ల మండలంలోని పెట్ని కోట బందార్లపల్లె తుమ్మలపెంటతో పాటు అనేక గ్రామాల్లో టీడీపీ అనుచరులు అసైన్మెంట్ కమిటీ లేకుండానే దొంగ పట్టాలు సృష్టించి లక్షలాది రూపాయల సొమ్ము చేసుకున్నారని ఆరోపించారు. ఇందులో కొలిమిగుండ్ల మండలం టిడిపి పార్టీ అధ్యక్షులు మూల రామేశ్వర రెడ్డి కూడా దొంగ పట్టా పొంది ఉండడం గమనార్హం అని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News