Saturday, September 21, 2024
Homeఆంధ్రప్రదేశ్Banaganapalli: బీజేపీని వీడి టీడీపీ చేరిన నేతలు

Banaganapalli: బీజేపీని వీడి టీడీపీ చేరిన నేతలు

బనగానపల్లె పట్టణంలోని బీసీ కాలనీకు చెందిన భారతీయ జనతా పార్టీ నంద్యాల అధ్యక్షులు ప్రసాద్ తో పాటు నయీమ్ జ్ఞాన ప్రకాష్, శివ, హరి, రాముడు, రాకేష్, ప్రదీప్, నాగరాజు, బాలరాజు, మహేంద్ర, ప్రమోద్, మహేష్, శ్రీకాంత్, సాగర్, బాల యేసు, ఓబులేసు, సుబ్రహ్మణ్యం, పుల్లయ్య, అశోక్ , నాగేశ్వరరావు, మరో 50 కుటుంబాలు బీజేపీని వీడి టీడీపీలో చేరారు. వీరిని టీడీపీ కండువా కప్పి సాదరంగా పార్టీ లోకి ఆహ్వానించారు బీసీ జనార్దన్ రెడ్డి. అనంతరం బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండీ ఎటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం లేదనే కారణంతో గ్రామ ప్రజలు విసుగు చెంది, టీడీపీలో చేరారనీ అన్నారు. తెలుగుదేశం పార్టీతోనే అభివృద్ధి సాధ్యం అని కనుక నియోజకవర్గంలో త్వరలో వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీలోకి చేరడానికి చాలామంది ఎదురు చూస్తున్నారని తెలిపారు. అలాగే 100 మీటర్ల రోడ్డు వేయడానికి నాలుగు సంవత్సరాలు పట్టిందని ఎలాంటి అభివృద్ధి నోచుకోవడం లేదని అందుకే టిడిపిలో చేరినట్టు చేరిన వారు ఆరోపించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News