Monday, September 16, 2024
Homeఆంధ్రప్రదేశ్CPI: మోడీని గద్దె దింపి, బిజెపిని ఓడించాలి

CPI: మోడీని గద్దె దింపి, బిజెపిని ఓడించాలి

దేశద్రోహి అయినా నరేంద్ర మోడి గద్దె దింపాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఉభయ కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి గౌస్ దేశ అనంతరం వారు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలి బిజెపిని ఓడించాలి అనే నినాదంతో వామపక్షాలు సభన నిర్వహించారు.ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ మోడీ పాలన వచ్చినప్పటి నుంచి దేశమంతా ప్రైవేటీకరణ అయిందని ఆయన పేర్కొన్నారు. అవినీతి నిర్మూలన,దేశ పేద ప్రజలకు మాట ఇచ్చి తప్పిన మోడీ. మోడీ ప్రభుత్వ పరిపాలన వచ్చినప్పటి నుంచి ప్రైవేటీకరణ సంస్థలను మోడీ పెంచి పోషిస్తున్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి పరిపాలనలోకి వస్తే రాష్ట్రాన్ని మొత్తం దివాలా తీశాడని, గండికోట 26వ డిఎంసీలు ఉండగా ఒక్క ఎకరాదు కూడా నీళ్లు ఇచ్చిన పాపాన పోలేదని ఆరోపించారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య, సిపిఎం పార్టీ కార్యదర్శి రంగారెడ్డి, సిపిఐ మండల కార్యదర్శి రాజె సాహెబ్, కమ్యూనిస్టు నాయకులు అడ్వకేట్ యన్ కృష్ణయ్య,సిపిఐ సిపిఎం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News