Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Emmiganuru: ఇంటింటికి 'బాబుతో నేను' ప్రచారం

Emmiganuru: ఇంటింటికి ‘బాబుతో నేను’ ప్రచారం

అక్రమ కేసులపై ప్రశ్నించండి

అక్రమ కేసులతో ప్రశ్నించే వారిని భయపెట్టలేరని టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగే శ్వర రెడ్డి, డోన్ టిడిపి ఇంఛార్జి ధర్మవరం సుబ్బా రెడ్డి అన్నారు. స్థానిక 1,2 వ వార్డులలో బాబు తో నేను ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బాబుతో నేను కరపత్రాలను పంపిణీ చేశారు. బాబు షూరిటి భవిషత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబు అక్రమ కేసులపై ప్రశ్నించాలని కోరారు. తప్పుడు కేసులతో వేధిస్తే ప్రజలే గుణపాఠం చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు నజీర్ అహ్మద్, మి, వాల్మీకి రాజు, శంకరమ్మ, ఖాజబీ పాల్గొన్నారు.

- Advertisement -

అంతకుముందు బీవీ ఆధ్వర్యంలో చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి మానసికంగా వేధిస్తున్నారంటూ నిరసన కార్యక్రమం సాగింది. స్థానిక సోమప్ప సర్కిల్ లో టిడిపి అధ్వర్యంలో 15రోజు జరిగిన నిరాహార దీక్షలు బీవీ జయనాగేశ్వర రెడ్డి సారథ్యంలో జరిగాయి. అనంతరం బీవీ జయనాగేశ్వర రెడ్డి మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక పాలనను ప్రశ్నించే ప్రతి ఒక్కరిపై అక్రమ కేసులు పెట్టి అరాచకాలు చేస్తున్న వైసిపిను ఇంటికి పంపే వరకు పోరాటాలు చేస్తామన్నారు. అభివృద్ధి సంక్షేమంను మరిచి ప్రతి పక్షాలపై కేసులతో భయపెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు సోమలగూడుర్ వెంకటరామి రెడ్డి, సుందర్ రాజు, మిఠాయి నరసింహులు, కొండయ్య చౌదరి, రామదాసు గౌడ్, దయాసాగర్, మునీర్, రామకృష్ణ నాయుడు, రంగస్వామి గౌడ్, మధుబాబు, కటారి రాజేంద్ర, దామ నరసింహులు, బంద నవాజ్, శాబీర్, పార్లపల్లి మల్లికార్జున, బోయ రంగన్న, నజీర్, అల్తాఫ్, మురళి రెడ్డి, కొండన్న గౌడ్, జయన్న, శంకర్ గౌడ్, డీలర్ ఈరన్న, దాదా వలి, నాగేష్ ఆచారి, శిల్పి భాస్కర్, సలీం, సలాం, గౌస్, బిజ్జే నాగరాజు, ఈశ్వర్, యు రవి, కృష్ణతేజ నాయుడు, డ్రైవర్ ఈరన్న, వెంకటేష్, కేశన్న పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News