Monday, May 19, 2025
Homeఆంధ్రప్రదేశ్Emmiganuru: సిఎం జగన్ సభ వేదిక పరిశీలన

Emmiganuru: సిఎం జగన్ సభ వేదిక పరిశీలన

'మేమంత సిద్దం' సభకు ముమ్మర ఏర్పాట్లు

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు రానున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను స్థానిక వీవర్స్ కాలని గ్రౌండ్ లో జరిగే సిఎం జగన్ మేమంతా సిద్దం బహిరంగ సభ వేదిక ఏర్పాట్లను వైసిపి నాయకులు పరిశీలించారు. ముఖ్యమంత్రి ప్రోగ్రాం కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, వైసిపి జిల్లా అధ్యక్షుడు, కర్నూలు ఎంపి అభ్యర్థి బీవై రామయ్య, ఎమ్మిగనూరు వైసిపి అభ్యర్థి బుట్టా రేణుకలు ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు సలహాలు చేశారు.

- Advertisement -

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మార్చి 29 న ఎమ్మిగనూరు పట్టణం వీవర్స్ కాలని గ్రౌండ్ లో జరిగే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మేమంత సిద్దం బహిరంగ సభకు వేలాదిగా విచ్చేసి జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో వైకాపా నాయకులు బుట్టా శివ నీలకంఠ, బుట్టా ప్రతుల్, బుట్టా రంగయ్య, ఖీబుల హుసేన్ ,శివ ప్రసాద్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News