Sunday, July 7, 2024
Homeఆంధ్రప్రదేశ్Emmiganuru: కొనసాగుతున్న టిడిపి దీక్షలు

Emmiganuru: కొనసాగుతున్న టిడిపి దీక్షలు

28 వ రోజుకు చేరుకున్న దీక్షలు

రాజకీయ కక్షతోనే చంద్రబాబును అరెస్టు చేశారని ఆయన విడుదల అయ్యేవరకు పోరాటం చేస్తామని టిడిపి నాయకులు సుందర్ రాజు, కొండయ్య చౌదరి, రామదాసు గౌడ్, దయాసాగర్, నేసే మల్లికార్జున అన్నారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహారదీక్షలు 28 వ రోజుకు చేరుకున్నాయి. సోమప్ప సర్కిల్ లో 28 రోజు జరిగిన దీక్షల్లో రిలే నిరాహార దీక్షలో నందవరం మండలం ఇబ్రహీంపురం టిడిపి నాయకులు బోయ గాలేప్ప, సుందర్ రాజు, తాయన్న,నరసింహులు, ఉరుకుందు, ఆంజనేయ, రాజు, జయన్న, ఈరన్న, భూపతి, వసంత్, నాగేష్, జీవరత్నం, రంజాన్, బొడ్డన్న , మహాబుబ్ బాషా, మోజేష్, సిఖామణీ, సుభాస్, ఖాదర్,బాబు, పెద్దమర్రివీడు మహాబుబ్ బాషా కూర్చున్నారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు కొండయ్య చౌదరి, రామదాసు గౌడ్, మిఠాయి నరసింహులు, మచాపూరం కాశీమ్ వలి, దయాసాగర్,కలిముల్లా, మల్లికార్జున, హుసేన్ పీర, రామకృష్ణ నాయుడు, రంగస్వామి గౌడ్,మధుబాబు,నజీర్ అహ్మద్, కటారి రాజేంద్ర, దాదా వలి, దామ నరసింహులు, మిన్నల్ల, వడ్డే కృష్ణ, కొండన్న గౌడ్,అబ్దుల్లా, సోమేష్ రెడ్డి, దేవేంద్ర, బచ్చాల రంగన్న, రుద్రాక్షల రంగన్న, డీలర్ ఈరన్న, నాగేష్ ఆచారి, శిల్పి భాస్కర్,శంకర్ గౌడ్,అంజి,వాల్మీకి రాజు, అబ్దుల్లా,పరమేష్, గాజుల సుధాకర్, వేంకటేశ్వర రెడ్డి, సోగనూరు జగదీష్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News