Sunday, September 22, 2024
Homeఆంధ్రప్రదేశ్Errakota Chennakesava Reddy: ఇంటింటికి జగనన్న నమ్మకం

Errakota Chennakesava Reddy: ఇంటింటికి జగనన్న నమ్మకం

ప్రజలు జగనన్న ప్రభుత్వమే కోరుకుంటున్నారన్నారన్నారు ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవ రెడ్డి. గడప గడపకు వెళ్లి జగన్ సర్కారు సంక్షేమ పథకాలు వివరిస్తున్నారు స్థానిక ఎమ్మెల్యే ఎర్రకోట. సంక్షేమ పాలన అందిస్తున్న జగనన్నను తిరిగి సీఎంగా గెలిపించుకుంటామని గడప గడపకు కార్యక్రమంలో అందరూ చెబుతున్నారని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి అన్నారు.

- Advertisement -

“జగనన్నే మా భవిష్యత్తు, మా నమ్మకం నువ్వే జగన్” కార్యక్రమంలో భాగంగా నందవరం మండల కేంద్రమైనా నందవరంలో ఎమ్మెల్యే సచివాలయ కన్వీనర్లు, గృహసారథులు, వాలంటీర్లు , ప్రజా ప్రతినిధులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతో కలసి ప్రజల ఇళ్ల వద్దకు వెళ్లి గత టీడీపీ, ప్రస్తుత వైఎస్సార్సీపీ పాలనలోని తేడాలను ఆయన వివరించారు. సంక్షేమ పథకాలు అందుతున్నాయా?, ఏమైనా సమస్యలు ఉన్నాయా? తదితర ప్రశ్నలు అడుగుతూ వారి సమాధానాలు ప్రజా మద్దతు పుస్తకంలో నమోదు చేసుకున్నారు. ప్రజల అనుమతితో వారి ఇంటి గోడలపై “మా నమ్మకం నువ్వే జగన్” స్టిక్కర్ అతికించి, మొబైల్ కు మరో స్టిక్కర్ అతికించి, టోల్ ఫ్రీ నెంబర్ కు మిస్ట్ కాల్ ఇప్పించారు. సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను 98 శాతం అమలు చేశారని ప్రజలకు వివరించారు.

ఈకార్యక్రమంలో లక్ష్మీ కాంత్ రెడ్డి, మండల కన్వీనర్ శివారెడ్డి గౌడ్, మండల జెసిఎస్ కన్వీనర్ చాంద్ బాషా, సచివాలయం కన్వీనర్లు, గృహసారథులు, వలంటీర్లు, జడ్పిటిసి నిఖిల్ చక్రవర్తి, నాయకులు, రమేష్ గౌడ్, యాల్ల గౌడ్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News