Saturday, April 12, 2025
Homeఆంధ్రప్రదేశ్Erukalacheruvu: పల్లె నిద్రలో గ్రామాలకు హెచ్చరికలు

Erukalacheruvu: పల్లె నిద్రలో గ్రామాలకు హెచ్చరికలు

క్రిష్ణగిరి మండలం పరిధిలో ప్రతి గ్రామము ఫ్యాక్షన్ రహిత గ్రామంగా చూడాలని స్థానిక ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా పోలీసులు స్థానికులతో మమేకమై పలు విషయాలపై హెచ్చరికలు జారీచేశారు. స్థానికంగా ఎటువంటి సమస్యలు, విభేదాలు ఉన్నా పరిష్కరించుకోవాలన్నారు. ఎవరైనా నాటుసారా, మద్యం , కర్ణాటక టెట్రా పాకెట్స్ వంటి వాటి అక్రమ రవాణాకు పాల్పడితే కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. ఫ్యాక్షన్ జోలికి ఎవరూ వెళ్లకూడదన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఎవరినీ ఉపెక్షించేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News