Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Gangula: 15 లక్షలతో నిర్మించిన సిసి రోడ్లును ప్రారంభించిన

Gangula: 15 లక్షలతో నిర్మించిన సిసి రోడ్లును ప్రారంభించిన

ఉయ్యాలవాడ మండలం నర్సిపల్లె గ్రామంలో ఆంజనేయ స్వామి గుడి ధ్వజ స్థంభ ప్రతిష్ఠ మహోత్సవంలో ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి పాల్గొన్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్న ఆయనకు అర్చకులు ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. గ్రామంలో 15 లక్షల రూపాయలతో నిర్మించిన సిసి రోడ్లను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన ఎమ్మెల్యే గంగుల ఈ కార్యక్రమంలో మండల వైసీపీ నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం సిరివెళ్ల మండల కేంద్రంలో 1వ సచివాలయం పరిధిలోని 3వార్డులో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి పాల్గొన్నారు. గడపగడపలో ప్రజలను ఆత్మీయ పలకరింపుతో పలకరించి సంక్షేమ పథకాలు వివరాలు అడిగి తెలుసుకుని, వాటిని వివరిస్తూ సంక్షేమ పథకాలు అందాయా లేదా అని అడిగి తెలుసుకుని అందని వారు, అర్హులైన వారు ఎవరైనా ఉంటే తెలపాలని ఆయన కోరారు. అక్కడున్న అధికారులకు ఆదేశాలు ఇస్తూ అర్హులైన వారు ఉంటే వెంటనే వారి వివరాలు సేకరించి సంక్షేమ పథకాలు అందే విధంగా చూడాలన్నారు .అలాగే ఏ సమస్యలు ఉన్న తమ దృష్టికి తేవాలని ఎమ్మెల్యే గంగుల తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వసీమ్ ,జడ్పిటిసి మెంబర్ దిల్షాద్ సర్పంచ్ ఉప సర్పంచ్ ఇంతియాజ్ రఫీ ,సలాం, మాజీ జడ్పిటిసి నజీర్ వైకాపా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News