Monday, November 17, 2025
Homeఆంధ్రప్రదేశ్IAS Officers: ఏపీలో పలువురు ఐఏఎస్‌ అధికారులకు పదోన్నతి

IAS Officers: ఏపీలో పలువురు ఐఏఎస్‌ అధికారులకు పదోన్నతి

ఏపీలో పలువురు ఐఏఎస్‌ అధికారుల(IAS Officers)కు పదోన్నతి లభించింది. 2000 బ్యాచ్‌కి చెందిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు సురేష్‌ కుమార్‌, సాల్మన్‌ ఆరోక్యరాజ్‌కు పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఇద్దరు అధికారులకు ముఖ్య కార్యదర్శి హోదా కల్పించింది. పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన శాఖ ముఖ్య కార్యదర్శిగా సురేష్ కుమార్‌ను నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. సాల్మన్‌ ఆరోక్యరాజ్‌ ప్రస్తుతం డిప్యుటేషన్‌పై కేంద్రంలో విధులు నిర్వహిస్తున్నారు.

- Advertisement -

ఇక 2009 బ్యాచ్‌కు చెందిన కార్తికేయ మిశ్రా, వీర పాండ్యన్‌, సీహెచ్‌ శ్రీధర్‌లకు కార్యదర్శి హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుతం సీఎంవోలో సహాయ కార్యదర్శిగా ఉన్న కార్తికేయ మిశ్రాకు..సీఎంవో కార్యదర్శిగా పదోన్నతి కల్పించారు. వీరపాండ్యన్‌ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సీఈవోగా.. కడప జిల్లా కలెక్టర్‌గా శ్రీధర్‌ను కొనసాగిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. అలాగే ఐపీఎస్‌ అధికారులు విక్రాంత్‌ పాటిల్‌, సిద్ధార్థ్‌ కౌశల్‌కు కూడా పదోన్నతి దక్కింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad