Sunday, September 8, 2024
Homeఆంధ్రప్రదేశ్Jagan bus yatra: చిత్తూరులో జగన్ మేమంతా సిద్ధం బస్ యాత్ర

Jagan bus yatra: చిత్తూరులో జగన్ మేమంతా సిద్ధం బస్ యాత్ర

చేరికలు, రోడ్ షోలు, సభలతో హోరెత్తుతున్న సిద్ధం టూర్

మేమంతా సిద్ధం బస్సుయాత్రలో తెలుగుదేశం పార్టీ నుంచి ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ సమక్షంలో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన కీలక నేతలు. అమ్మగారి పల్లె స్టే పాయింట్‌ వద్ద ముఖ్యమంత్రి వైయస్‌. జగన్‌ సమక్షంలో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన కుప్పం నియోజకవర్గానికి చెందిన ఉమ్మడి చిత్తూరు మాజీ జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఎం సుబ్రమణ్యంనాయుడు, కృష్ణమూర్తి, బేతప్పలు.

- Advertisement -

కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిధున్‌రెడ్డి, ఎమ్మెల్సీ భరత్‌ పాల్గొన్నారు. అమ్మగారిపల్లె నైట్‌ స్టే పాయింట్‌ వద్ద ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ను కలిసిన అన్నమయ్య, చిత్తూరు జిల్లా చెందిన వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు. పలువురు పార్టీ నేతలు, సీనియర్‌ కార్యకర్తలను పేరుపేరునా పలకరిస్తూ… యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న సీఎం వైయస్‌.జగన్‌. పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేసిన ముఖ్యమంత్రి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News