Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Kautalam TDP: తిక్కారెడ్డి అధ్వర్యంలో రీలే నిరహౕర దీక్ష

Kautalam TDP: తిక్కారెడ్డి అధ్వర్యంలో రీలే నిరహౕర దీక్ష

బాబు బయటికి వచ్చి, పార్టీని అధికారంలోకి తెస్తారని విశ్వాసం

చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించి, అరెస్టు చేయడం సరికాదని మంత్రాలయం నియోజకవర్గం టీడీపీ ఇన్ చార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు .. తెలుగు దేశం జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా మేము సైతం అంటు నియోజకవర్గం మంత్రాలయంలో రీలే నిరహౕర దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం మొత్తం చంద్రబాబుని అక్రమ అరెస్టు చేసినందుకు స్పందిస్తూంటే జగన్ మోహన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని తిక్కారెడ్డి ఆరోపించారు. చంద్రబాబు బయటికి వచ్చి, రానున్న రోజుల్లో తెలుగు దేశం పార్టీని అధికారంలోకి తెస్తారన్నారు తిక్కారెడ్డి.

- Advertisement -

ఈ రీలే నిరహౕర దీక్షలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి, మంత్రాలయం మండలం నాయకులు క్లస్టర్ ఇన్ చార్జ్ లు యల్లారెడ్డి, చావిడి వెంకటేష్, బిసి సెల్ అధ్యక్షులు మాధవరం అమర్నత్ రెడ్డి, తెలుగు రైతు జిల్లా కార్యదర్శి గోపాల్ రెడ్డి, టిడిపి సీనియర్ నాయకులు గోపాలకృష్ణ స్వామి, పెద్దకడూబురు మండలం కన్వీనర్ బసలదోడ్డి ఈరన్న, కోసిగి మండలం కన్వీనర్ జ్ఞానేష్,దూదేకుల సంఘం జిల్లా అధ్యక్షులు తెలుగు రైతు జిల్లా కార్యదర్శి ఉప్పురాళ్ళు సాయిబాబా, అశోక రెడ్డి, తెలుగు రైతు జిల్లా ప్రదాన కార్యదర్శి వెంకటపతి రాజు, తెలుగు యువత నియోజకవర్గం అధ్యక్షులు బాపురం సుదీర్ రెడ్డి, నియోజకవర్గం అధ్యక్షులు టిపుసుల్తాన్ పాల్గొన్నారు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News