Wednesday, September 18, 2024
Homeఆంధ్రప్రదేశ్Kids too contributing Vijayawada flood relief ops: వరద సాయానికి కలిసిన చిట్టి...

Kids too contributing Vijayawada flood relief ops: వరద సాయానికి కలిసిన చిట్టి చేతులు

మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ను క్యాంపు కార్యాలయంలో కలిసి తన కిడ్డీ బ్యాంక్‌లో ఉన్న నగదు రూ. 10,000 అందజేసిన ఉయ్యూరుకు చెందిన రాజులపాటి అభయ్‌రామ్‌

- Advertisement -

ఉయ్యూరులో ఒకటో తరగతి చదువుతున్న అభయ్‌రామ్‌ తన తండ్రి రామచంద్రరావుతో కలిసి వైఎస్‌ జగన్‌ దగ్గరకు వచ్చి తన వంతుగా వరద బాధితులకు సాయం చేయాలనుకుంటున్నట్లు వెల్లడి.

అభయ్‌రామ్‌ను అభినందించిన వైఎస్‌ జగన్, భవిష్యత్‌లో ఉన్నత చదువులు చదువుకుని సమాజానికి ఉపయోగపడాలని సూచన, ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ను కలిసిన అభయ్‌రామ్‌ కుటుంబ సభ్యులు, పెనమలూరు వైఎస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి.

వరద సహాయక చర్యల నిమిత్తం రూ. 50,000 చెక్‌ వైఎస్‌ జగన్‌కు అందజేసిన ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం దేవపూడికి చెందిన వైఎస్‌ఆర్‌సీపీ నేత కట్టా మహేష్, పాల్గొన్న దేవపూడి మాజీ సర్పంచ్‌ పెద్ది వీరయ్య.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News