Wednesday, October 9, 2024
Homeఆంధ్రప్రదేశ్Kurnool: దేవరగట్టు పరిసర గ్రామాల్లో కార్డన్ సెర్చ్ ఆపరేషన్

Kurnool: దేవరగట్టు పరిసర గ్రామాల్లో కార్డన్ సెర్చ్ ఆపరేషన్

జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్

దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లాలో అత్యంత వైభవంగా నిర్వహించే దేవరగట్టు శ్రీ మాల మల్లేశ్వర స్వామి బన్ని ఉత్సవాన్ని ప్రశాంతంగా నిర్వహించుకోవాలని జిల్లా ఎస్పీ గరికపాటి బిందు మాధవ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్టోబర్ 12 శనివారం రాత్రి దేవరగట్టు శ్రీ మాలమల్లేశ్వర స్వామి బన్ని ఉత్సవం సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసు యంత్రాంగం అన్ని రకాల పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టిందని కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ తెలిపారు. బన్ని ఉత్సవానికి 800 మంది పోలీసులతో పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశామన్నారు. ఇందులో 7 మంది డిఎస్పీలు, 42 మంది సిఐలు, 54 మంది ఎస్సైలు, 112 మంది ఎఎస్సైలు మరియు హెడ్ కానిస్టేబుళ్ళు, 362 మంది కానిస్టేబుళ్ళు, 50 మంది స్పెషల్ పార్టీ పోలీసులు , 3 పట్లూన్ల ఎఆర్ పోలీసులు , 95 మంది హోంగార్డులు బన్ని ఉత్సవం బందోబస్తు విధులలో పాల్గొంటారని తెలిపారు.

శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై జిల్లా పోలీసు యంత్రాంగం గట్టి నిఘా ఏర్పాటు చేసిందన్నారు. బన్ని ఉత్సవంలో ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి, అల్లర్లు, నిప్పులు విసరడం వంటివి చేస్తే అలాంటి వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని, ఉత్సవంలో మద్యం సేవించి రింగులు గల కర్రలతో ఉత్సవంలో పాల్గొనడం వల్ల తలలకు గాయాలు కావడం వంటి దుష్పరిమాణాలపై దేవరగట్టు చుట్టు ప్రక్కల నెరణికి, కొత్తపేట, అరికెర, ఎల్లార్తి, గ్రామాలలో పోలీసు, రెవిన్యూ శాఖల సమన్వయంతో ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని, దేవరగట్టు పరిసర గ్రామాల్లో కార్డన్ సెర్చ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నామని ముందు జాగ్రత్తల చర్యల్లో భాగంగా గతంలో ఘర్షణకు పాల్పడ్డ వారిని, అక్రమ మద్యం రవాణా చేసే వారిని గుర్తించి 148 మందిని బైండోవర్ చేసి అదుపులోకి తీసుకున్నామన్నారు. దేవరగట్టు చేరుకునే పరిసర గ్రామాల్లోనూ, ప్రధాన రహాదారుల్లోనే కాక చిన్న చిన్న దారుల్లోనూ బందోబస్తు, చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నామని, ఉత్సవంలో ఎలాంటి రక్త గాయాలు కాకుండా పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తామన్నారు.

బన్ని ఉత్సవంలో ఫైర్ సిబ్బంది, వైద్యసిబ్బంది, అంబులెన్స్ సర్వీసులు అందుబాటులో ఉండే విధంగా అన్ని చర్యలు తీసుకున్నామని ఉత్సవం ప్రశాంతంగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహాకరించాలని, భక్తుల్లో మార్పు రావాలని, ఈ కర్రల సమరానికి స్వస్తి పలకాలని దేవరగట్టు పరిసర ప్రాంతాల ప్రజలకు ఎస్పీ విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News