Sunday, November 16, 2025
Homeఆంధ్రప్రదేశ్Mantralayam: హరిద్వార్ లో రాఘవేంద్ర స్వామి మఠం

Mantralayam: హరిద్వార్ లో రాఘవేంద్ర స్వామి మఠం

మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి శ్రీ సుభుధేంద్ర తీర్థులు సోమవారం హరిద్వార్ ను సందర్శించారు. ముందుగా పవిత్ర గంగా నదిలో పుణ్యస్నానం ఆచరించి గంగమ్మకు సుభుధేంద్ర తీర్థుల వారు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం హరిద్వార్ లో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం నిర్మాణ పనులను పరిశీలించి, వేగవంతంగా పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. త్వరలో హరిద్వార్ లో మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠం భక్తులకు అందుబాటులోకి రానుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad