Thursday, July 4, 2024
Homeఆంధ్రప్రదేశ్Mantralayam: చంద్రబాబుకు మద్దతుగా 'సత్యమేవ జయతే దీక్ష'

Mantralayam: చంద్రబాబుకు మద్దతుగా ‘సత్యమేవ జయతే దీక్ష’

బాబుకు మద్దతుగా దీక్షలు

మంత్రాలయం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు అరెస్టును ప్రతిఘటిస్తూ, చంద్రబాబుకు మద్దతుగా దీక్ష చేశారు. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా తెలుగు దేశం పార్టీ ఆదేశాలు మేరకు సెంట్రల్ జైలులో చంద్రబాబు, ఢిల్లీలో నారా లోకేష్, రాజమండ్రిలో నారా భువనేశ్వరి చేస్తున్న సత్యమేవ జయతేదీక్షకు మద్దతుగా మంత్రాలయంలో మహత్మ గాంధీ విగ్రహానికి పాలభిషేకం చేసి, పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం సత్యమేవ జయతే దీక్షలో మంత్రాలయం నియోజకవర్గంలోని నాలుగు మండలాలు అన్ని గ్రామాలు నాయకులు కార్యకర్తలతో పాటు ఆటో డ్రైవర్ యూనియన్ నాయకులు కలిసి దీక్షలో పాల్గొన్నారు. తిక్కారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబుపై రాజకీయ కక్షతో, అక్రమ కేసులు పెట్టి, అక్రమ అరెస్టు చేశారన్నారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి, తెలుగు యువత జిల్లా ప్రదాన కార్యదర్శి పాలకుర్తి దివాకర్ రెడ్డి, తెలుగు రైతు రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంత్ రెడ్డి, తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి అడివప్ప గౌడ్, టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు చెన్నబసప్ప, తెలుగు రైతు జిల్లా ప్రదాన కార్యదర్శి వెంకటపతి రాజు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News